డిస్కవరీ చానల్ అంటే ప్రపంచంలో తెలియని వారు ఉండరు.అందులో ఎక్కువగా యానిమల్ రిలేటెడ్ షోలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.
ఈ చానల్ లో ప్రసారమయ్యే షోలకి విపరీతమైన రేటింగ్స్ ఉంటాయి.ఇదిలా ఉంటే ఇందులో బ్రిటన్ సాహసవీరుడు బేర్ గ్రిల్స్ చేసి మ్యాన్ వెర్సస్ వైల్డ్ షోకి మంచి గుర్తింపు ఉంది.
ఈ షో ద్వారా చాలా మంది సెలబ్రిటీలని గ్రిల్స్ అడవులలోకి తీసుకెళ్తూ ఉంటారు.ఇక ఇప్పటికే ఇండియాలో ప్రధాని మోడీతో కలిసి గతంలో గ్రిల్స్ ఒక షో చేశాడు.
ఈషోకి చానల్ లో విపరీతమైన రేటింగ్స్ వచ్చాయి.అలాగే సోషల్ మీడియాలో కూడా రికార్డుస్థాయిలో వ్యూస్ వచ్చాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ ని గ్రిల్స్ అడవులలోకి తీసుకెళ్ళాడు.జంతువులకి చాల దగ్గరగా ఈ షో షూటింగ్ చేశారు.ఇక రజినీకాంత్ చాలా ఉత్సాహంగా ఈ డాక్యుమెంటరీ షోలో పాల్గొన్నాడు.ఇదిలా ఉంటే ఈ షో సందర్భంగా రాజినికి గాయం అయ్యిందని వార్తలు వచ్చిన అది చిన్న గాయం అని ఆయన క్లారిటీ ఇచ్చారు.
దీంతో వెంటనే కోలుకుని 2వరోజు షూటింగ్ లో పాల్గోన్నారు.డాక్యుమెంటరీ బృందంతో రజనీకాంత్ దిగిన ఫోటోలను బేర్ గ్రిల్స్ షల్ మీడియాలో పంచుకున్నారు.
ఇక ఈషోపై రజినీకాంత్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.ఈ డాక్యుమెంటరీ షూట్ జీవితంలో మరిచిపోలేని అనుభూతిని ఇచ్చిందని అన్నారు.
ఇదికో అద్బుతమైన షో అని పొగిడేశారు.ఇక షోని నిర్వహిస్తున్న గ్రిల్స్ ట్విట్టర్ లో కామెంట్స్ పెట్టారు.
గతంలో ప్రధాని మోడీతో చేసిన ఎపిసోడ్ కి రికార్డ్ వ్యూస్ వచ్చాయి.ఇప్పుడు రజినితో చేసిన ఈ ఎపిసోడ్ తో ఆ రికార్డ్ ని అధికమిస్తాం అని అన్నారు.
ఇక ఈ షూటింగ్ లో రేపు అక్షయ్ కుమార్ కూడా పాల్గొంటారు.ఇదంతా కర్నాటక ఫారెస్ట్ లో జరుగుతుంది.