తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల దర్బార్ చిత్రంతో అదిరిపోయే సక్సెస్ను అందుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో రజినీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా, ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేశాడు.
ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్తో తన నెక్ట్స్ మూవీని అప్పుడే పట్టాలెక్కించాడు రజినీ.తమిళ మాస్ చిత్రాల దర్శకుడు శివ డైరెక్షన్లో తలైవా తన తాజా చిత్రాన్ని తెరకెక్కి్స్తున్నాడు.
ఈ సినిమాకు అన్నాతై అనే టైటిల్ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేయగా పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను శివ డైరెక్ట్ చేస్తున్నాడు.శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా, కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్డౌన్తో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.
అయితే ఇప్పుడు పరిస్థితులు మరింత చేజారుతుండటంతో రజినీ ఈ సినిమా షూటింగ్ను ఇప్పుడప్పుడే ప్రారంభించవద్దని అంటున్నాడు.ముఖ్యంగా తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుండటంతో చిత్ర యూనిట్ను రిస్క్లో పెట్టొద్దని తలైవా కోరుతున్నాడు.
వీలైనంత నెమ్మదిగా ఈ సినిమా షూటింగ్ను ప్రారంభించాలని చిత్ర యూనిట్కు రజినీ సూచించాడట.దీంతో ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అవుతుండటంతో ఈ సినిమా రిలీజ్ కూడా చాలా ఆలస్యం కానుందని, పరిస్థితులు అనుకూలిస్తే ఈ సినిమాను వచ్చే వేసవిలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది.