టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నిలబడటానికి చాలా రోజుల నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.నటుడుగా ఇప్పటికే తనని తాను ప్రూవ్ చేసుకున్న సందీప్ హీరోగా మాత్రం ఫెయిల్యూర్స్ తో సహవాసం చేస్తున్నాడు.
రీసెంట్ గా వచ్చిన తెనాలి రామకృష్ణ కూడా డిజాస్టర్ అయ్యింది.ఆయన కెరియర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు అంటే వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, నిను వీడని నీడను నేనే సినిమాలు మాత్రమే కనిపిస్తున్నాయి.
ఇక సందీప్ కిషన్ నటుడుగానే కాకుండా బిజినెస్ మెన్ గా కూడా ఉన్నాడు.వివాహ భోజనంబు అనే పేరుతో హోటల్స్ నడుపుతున్నాడు.
మరో వైపు నిర్మాతగా కూడా మారి సినిమాలు నిర్మిస్తున్నాడు.తనకి కెరియర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ పేరుతనే తన ప్రొడక్షన్ పేరుగా మార్చుకొని సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నాడు.
వెంకటాద్రి టాకీస్ నిర్మాణంలో నిను వీడని నీడను నేనే అనే చిత్రాన్ని నిర్మించి మొదటి సక్సెస్ అందుకున్నాడు.తాజాగా నిర్మాతగా సందీప్ కిషన్ మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు.
వివాహ భోజనంబు టైటిల్ తో సినిమా ప్రీలుక్ కూడా రిలీజ్ చేశాడు.వెంకటాద్రి టాకీస్, సోల్జర్స్ ఫ్యాక్టరీ పతాకాలపై ఈ సినిమా తెరకెక్కనుంది.దీనికి రామ్ అబ్బరాజు దర్శకుడు కాగా, జెమిని కిరణ్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.ఏ1 ఎక్స్ ప్రెస్ చిత్రానికి కూడా సందీప్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.ఇక రాజేంద్రప్రసాద్ క్లాసిక్ హిట్ మూవీ అయిన వివాహభోజనంబు అనే టైటిల్ పెట్టడంతో సినిమాపై కాస్తా క్యూరియాసిటీ పెంచాడు.కామెడీ ఎంటర్టైనర్ గానే ఈ సినిమా ఉండబోతుందని ఫ్రీలుక్ బట్టి తెలుస్తుంది.
ఇక ఇందులో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.