టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా ఎఫ్ 3.ఈ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఇది F2 సినిమాకు సీక్వెల్ గా వస్తుంది.F2 సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ అందుకోవడంతో దీనికి సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమాను డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు.కామెడీతో కడుపుబ్బా నవ్వినా ఎఫ్ 2 ఇప్పుడు మరింత ఫన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
డబ్బు చుట్టూ నడిచే కామెడీ డ్రామాను తెరకెక్కించ బోతున్నట్టు అనిల్ రావిపూడి తెలిపాడు.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఎఫ్ 3 సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది.ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరగవుతుండడంతో షూటింగ్ త్వరలోనే స్టార్ట్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.
ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.F2 సినిమా విడుదల అయిన సమయంలోనే అనిల్ రావిపూడి F3 సినిమాను కూడా ప్రకటించారు.
తాజాగా ఈ సినిమాపై ఒక ఆసక్తికర వార్త వైరల్ అవుతుంది.ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ క్యారక్టర్ గురించి ప్రస్తుతం మీడియాలో చర్చ జరుగుతుంది.ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ పిసినారిగా కనిపించి మరింత కామెడీ ను పంచబోతున్నట్టు టాక్.
ఈ పాత్ర ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని టాక్ వినిపిస్తుంది.మరి చూడాలి రాజేంద్రప్రసాద్ తన టైమింగ్ తో ప్రేక్షకులను ఎంత మేరకు మెప్పిస్తాడో.
ఇది ఇలా ఉంటె త్వరలోనే హైదరాబాద్ లోని సారధి స్టూడియోస్ లో షూటింగ్ మొదలు పెట్టాలని భావిస్తున్నారట.ఈ సినిమా త్వరగా పూర్తి చేసి అనుకున్న సమయానికి విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తున్నారు.ఈ సినిమా ను ఆగస్టు 27 విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.కానీ అనుకున్న సమయానికి వస్తుందో లేదో వేచి చూడాల్సిందే.