రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా నటించి నటుడిగా తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్న రాజీవ్ కనకాల తక్కువ సినిమాల్లో నటిస్తున్నా పేరు తెచ్చిపెట్టే పాత్రలకు ఎక్కువగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.రెచ్చిపోదాం బ్రదర్ అనే టీవీ షోతో ప్రస్తుతం బిజీగా ఉన్న రాజీవ్ కనకాల తాజాగా ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ అయ్యారు.
తనకు ఎదురైన ఒక అనుభవం గురించి రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.
సాధారణంగా ఫ్యాన్స్ తమ ఫేవరెట్ యాక్టర్లు కనిపిస్తే సంతోషించడంతో పాటు ఆ యాక్టర్లతో ఒక్క ఫోటో అయినా దిగాలని భావిస్తారనే సంగతి తెలిసిందే.
ఒకప్పుడు ఫేవరెట్ యాక్టర్ల దగ్గర ఆటోగ్రాఫ్ లు తీసుకున్న అభిమానులు ప్రస్తుతం ఫోటోగ్రాఫ్ లు, సెల్ఫీలు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.రాజీవ్ కనకాల తన అభిమాని ఒకరు తాను ఎయిర్ పోర్ట్ కు వెళుతున్న సమయంలో పరుగెత్తుకుంటూ వచ్చి సెల్ఫీ అడిగారని చెప్పుకొచ్చారు.
ఈ ఫోటోలో ఉండే వ్యక్తి ఎవరో తనకు తెలియదని 2018 సంవత్సరంలో చెన్నై ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్ కొరకు నడుచుకుంటూ వెళుతుంటే ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చి తాను క్లీనింగ్ డిపార్టుమెంట్ కు చెందిన వ్యక్తినని పరిచయం చేసుకున్నాడని తనను కలిసిన సమయంలో ఆ వ్యక్తి చాలా ఆనందంగా ఉన్నాడని రాజీవ్ కనకాల అన్నారు.అతని దగ్గర ఫోన్ లేకపోవడంతో తన ఫోన్ లోనే ఫోటో తీశానని ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని అనుకుని మరిచిపోయానని రాజీవ్ కనకాల వెల్లడించారు.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫోటోను ఆ వ్యక్తి తీసుకుంటాడని ఆశిస్తున్నానని రాజీవ్ కనకాల అన్నారు.రాజీవ్ కనకాల అభిమాని ఫోటో పోస్ట్ చేయడంతో నెటిజన్లు రాజీవ్ కనకాలను మెచ్చుకుంటున్నారు.అభిమానిని గుర్తుంచుకుని మరీ ఫోటో షేర్ చేసినందుకు రాజీవ్ కనకాలకు ఫ్యాన్స్ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.