రెండు తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెర నంబర్ 1 యాంకర్ ఎవరనే ప్రశ్నకు చాలామంది యాంకర్ సుమ అని సమాధానం చెబుతారు.ప్రస్తుతం సుమ రవితో కలిసి బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ అనే షో చేస్తున్నారు.
జీ తెలుగు ఛానల్ లో ఈ షో ప్రసారమవుతుండగా ప్రతి వారం సెలబ్రిటీలు ఈ షోకు గెస్ట్ లుగా హాజరవుతున్నారు.యాంకర్ రవి, సుమ కలిసి ఈ షో చేస్తుండగా ఆశించిన స్థాయిలో రేటింగ్ లు రాకపోయినా షో మాత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది.
బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఎపిసోడ్ 6కు రాజీవ్ కనకాల, శ్యామల, హిమజ గెస్టులుగా హాజరయ్యారు.ఇప్పటికే సుమ హోస్ట్ చేసిన పలు షోలలో రాజీవ్ పాల్గొన్న సంగతి తెలిసిందే.
ప్రోగ్రామ్ లో యాంకర్ రవి బయట సీతారాములు సీతారాములు అంటూ ఉంటామని సీతారాములు సాక్షాత్తూ ఎలా ఉంటారంటే ఇలా ఉంటారని చెప్పగా రాజీవ్ కనకాల రామాయణంలో సీత చాలా తక్కువ మాట్లాడుతుందని విన్నానని అనగా హిమజ, శ్యామల ఫక్కున నవ్వేశారు.
రవి ఎలా భరిస్తున్నావ్ బావా.? అని అనగా రాజీవ్ వెంటనే నువ్ ఎలా భరిస్తున్నావ్ రవి.? అంటూ రివర్స్ లో పంచ్ వేశారు.సుమ పచ్చిమిరపకాయల పచ్చడి అంటే తనకు ఇష్టమని పచ్చి మిరపకాయలు మాత్రమే నూరి నోట్లో పెడుతుందని అనగా సుమ మా కేరళ్లలో పచ్చళ్లు లేవని చెబుతారు.రాజీవ్ పచ్చళ్లు ఉన్నాయని ఈవిడకు రావని అన్నారు.
ఆ తరువాత షోలో భాగంగా ఒక ఆర్టిస్ట్ రాజీవ్ కళ్లకు గంతలు కట్టి రాజీవ్ చేత దేవదాస్ కనకాల పెయింటింగ్ చిత్రపటం వేయించారు.
తండ్రి చిత్రపటం చూడగానే రాజీవ్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.సుమ కూడా మామ చిత్రపటాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.రాజీవ్ కనకాల తండ్రి జ్ఞాపకాలను చెప్పాలనే ప్రయత్నం చేయగా అతని మాటలు తడబడ్డాయి.
రాజీవ్ అంతకుముందే ఆర్టిస్ట్ వేసిన ఎన్టీఆర్ ఫోటోను తీసుకుని ఒకవైపు తండ్రి, మరోవైపు స్నేహితుడు అంటూ దేవదాస్ కనకాల, ఎన్టీఆర్ ఫోటోలను చూపించారు.