యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సాధారణంగా కూల్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.అయితే అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తారక్ సుమపై సీరియస్ కావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
వాళ్లు అడగకపోయినా నువ్వు చెప్పేసేలా ఉన్నావ్ అంటూ తారక్ కామెంట్స్ చేసిన సీరియస్ లుక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.అయితే తారక్ సీరియస్ గా రియాక్ట్ కావడంతో సుమ ఏడ్చేశారని తెలుస్తోంది.
అప్ డేట్ గురించి అడిగితే తారక్ ఇంత సీరియస్ గా రియాక్ట్ అవుతారని సుమ భావించలేదని బోగట్టా.ఈ ఘటనకు సంబంధించి రాజీవ్ కనకాల నుంచి తారక్ కు ఫోన్ వెళ్లిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సుమ అలా అప్ డేట్ గురించి చెప్పడంతో ఊహించని విధంగా నేను రియాక్ట్ అయ్యానని తారక్ చెప్పినట్టు తెలుస్తోంది.రాబోయే రోజుల్లో సుమ లేదా ఎన్టీఆర్ ఇందుకు సంబంధించి క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
రాజీవ కనకాల ఎన్టీఆర్ కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది.ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన చాలా సినిమాలలో రాజీవ్ కనకాల నటించారు.కొన్ని సినిమాలలో రాజీవ్ కనకాలకు కచ్చితంగా పాత్ర ఉండాలని తారక్ డిమాండ్ చేశారని కూడా ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.అయితే తారక్ ఆరోగ్యం బాలేని సమయంలో అప్ డేట్ అడిగి సుమ తప్పు చేశారని కొంతమంది చెబుతున్నారు.
ఎన్టీఆర్ అనుమతి లేకుండా సుమ అలా అడిగి ఉండకూడదని కామెంట్లు చేస్తున్నారు.గత నెలలోనే అప్ డేట్ వచ్చిందని పదే పదే అప్ డేట్లు అడగటం కరెక్ట్ కాదని కొంతమంది చెబుతున్నారు.తారకరత్న ఆరోగ్య సమస్యల వల్ల నందమూరి కుటుంబం ప్రస్తుతం సంతోషంగా లేదని ఇలాంటి సమయంలో అప్ డేట్లు కోరడం ఏ మాత్రం కరెక్ట్ అని కొంతమంది నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.