ఈ సంవత్సరం మొత్తానికి ఐపీఎల్ సీజన్ జరుగుతుందో జరగదో అన్న భారత క్రికెట్ అభిమానులకు ఎట్టకేలకు రాబోయే పది రోజుల్లో యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సీజన్ మొదలు కాబోతుంది.ఇందుకు సంబంధించి ఐపీఎల్ మొత్తం జట్లు వారి టీం ప్లేయర్స్ తో యూఏఈ కి చేరుకున్నాయి.
ప్రస్తుతం ఆటగాళ్లందరూ అక్కడ క్వారంటైన్ సమయాన్ని పూర్తి చేశారు కూడా.ఇకపోతే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో కరోనా కలకలం రాగ చికిత్స అనంతరం వారందరికీ నెగిటివ్ అని తేలడంతో అటు బిసిసిఐ ఇటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నాయి.
ఇకపోతే తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్ సంబంధించి రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీని యూఏఈలో అట్టహాసంగా ఆవిష్కరించింది.ఇందుకు సంబంధించి కొత్త జెర్సీలను టీం జట్టు సభ్యులకు అందచేసింది.
ఇందుకు సంబంధించి దుబాయిలో ఫ్రాంచైజీ రెడ్ బుల్ స్కై డైవింగ్, వింగ్ షూట్ అథ్లెట్ డానీ రోమన్ తో వినూత్నంగా రాజస్థాన్ రాయల్స్ వారి జెర్సీని రిలీజ్ చేయడం జరిగింది.ఇందుకు సంబంధించి మిరాజ్ రిసార్ట్ వద్ద స్కై డ్రైవింగ్ చేస్తూ దిగిన డానీ రోమన్, రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్ళకు కొత్త జర్సీ లని అందజేశాడు.
ఈ కార్యక్రమం సంబంధించి పూర్తి వీడియోను రాజస్థాన్ రాయల్స్ తన ఫ్యాన్స్ కోసం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసింది.ఇకపోతే సెప్టెంబర్ 19 నుండి ఐపీఎల్ 2020 సీజన్ మొదలు కాబోతోంది.
ఈ సీజన్ లో మొట్టమొదటి మ్యాచ్ గా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది.