వ్యాపారం బాగుండాలి అంటే కొత్త కొత్తగా ఆలోచించాలి.అప్పుడే వ్యాపారాల పరంగా లాభం పొందగలుగుతాం.
అందుకే ఏ స్పెషల్ డే వచ్చిన దానికి తగ్గట్టు వ్యాపారాలు చేసేస్తుంటారు.వాలంటైన్స్ డే, ఫ్రెండ్షిప్ డే, మథర్స్ డే, ఫాదర్స్ డే అని మాత్రమే కాకుండా ప్రస్తుతం అందరిని వణికించే కరోనా సీజన్ ని కూడా వాడేసుకుంటున్నారు వ్యాపారాలు.
కరోనా సీజన్ లో శానిటైజర్లు, మాస్కులు, ఫేస్షీల్డులు అమ్మడం పెద్ద విశేషమేమీ కాదు.కానీ కరోనా రూపంలో వంటకాలను అమ్మడమే స్పెషలిటీ.కొద్దీ రోజుల క్రితం ఓ బేకరీలో కరోనా రూపంలో స్వీట్లు తయారు చేసి విక్రయించారు.అది ఎలా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు కూడా అలానే ఓ రెస్టారెంట్ చేసిన వంటకాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాజస్థాన్లో జోద్పూర్లోని ఓ రెస్టారెంటులో ఏకంగా కోవిడ్ స్పెషల్ కర్రీలు తయారు చేసి అమ్ముతున్నారు.
మలాయ్ కోఫ్తాలను కరోనా రూపంలో మలిచి కర్రీలుగా వడ్డిస్తున్నారు.నాన్, చపాతీలను మాస్కుల రూపంలో తయారు చేస్తున్నారు.
ఈ వంటకాలను తినేందుకు ఆహారప్రియులు కూడా ఇష్టపడుతున్నారు.
ఈ విషయంపై రెస్టారెంట్ యజమాని మాట్లాడుతూ వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు, పరిశుభ్రతగా ఉంటున్నట్టు, శానిటైజెషన్ ద్వారా వైరస్ సమస్య లేకుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలిపారు.
టచ్లెస్ మెనూ అందుబాటులోకి తెచ్చినట్టు భౌతిక దూరాన్ని పాటిస్తున్నట్టు అయన తెలిపారు.ప్రస్తుతం వీరి వంటకాలకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.