రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటు చేసుకుంది.ఆ పార్టీకి చెందిన వల్లభ్ నగర్ ఎమ్మెల్యే గజేంద్ర సింగ్ శక్తవట్ (48) కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఈరోజు ఉదయం కన్నుమూశారట.
పచ్చకామెర్లతో బాధపడుతున్న ఈయన ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగానే కరోనా లక్షణాలు బయట పడటంతో అవి నిర్దారించడానికి కరోనా పరీక్షలు చేయగా కోవిడ్ పాజిటివ్ తేలిందట.దీంతో నెల రోజుల నుండి చికిత్స పొందుతున్న గజేంద్రసింగ్ ఆరోగ్యం విషమించడంతో ఈరోజు మృతిచెందారట.
ఇక స్వాతంత్ర సమరయోధుడు గులాబ్ సింగ్ కుమారుడైన గజేంద్రసింగ్, వల్లభ్నగర్ నుంచి 2008, 2018లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.కాగా గజేంద్ర సింగ్ మృతికి రాజస్దాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్, పార్టీ సీనియర్ నాయకుడు సచిన్ పైలెట్తో పాటుగా పలువురు కాంగ్రెస్ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.