రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక పై మాట్లాడుతూ.
ఇతరులను ఆమోదించడం కంటే రెబల్ గానే పోరాడటం నయమనే ఆలోచనలో తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలిపారు.కాంగ్రెస్ చరిత్రలో మొదటిసారి ఏకవాక్య తీర్మానం ఆమోదం పొందలేదు అన్నారు.అందుకు విచారిస్తున్నానన్న ఆయన క్షమాపణలు కూడా చెప్పానన్నారు.2020లో సంరక్షకుడిగా ఉంటానని తన ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చానని, రాజస్థాన్ వీడి వెళితే తమకు ఏం జరుగుతుందోనన్న భయం వారిలో ఉందని పేర్కొన్నారు.అందుకే రాజస్థాన్ సీఎల్పీ నేతగా జరిగిన దానికి బాధ్యత తీసుకున్నానని పేర్కొన్నారు.రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూలదోయాలని బిజెపి ప్రయత్నిస్తుందని ఆరోపించారు.సర్కార్ ఐదేళ్లు పూర్తి చేసుకోవాలని విపక్షాలు కోరుకోవడం లేదని వ్యాఖ్యానించారు.ఇటీవల కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి పోటీ పడాలనుకున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే మరో అభ్యర్థిగా సచిన్ పైలట్ పేరు రావడంతో ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధమైయ్యారు.