కరోనా బారినపడిన మరో సీయం.. !

దేశంలో కరోనా ఎవరిని వదిలి పెట్టడం లేదు.ఈ విషయం తెలిసి కూడా ఎన్నికలు అంటూ నేతలు కరోనా వ్యాప్తికి కారణం అయ్యారు.

 Rajasthan Cm Ashok Gehlot Infected With Corona , Rajasthan, Chief Minister, Asho-TeluguStop.com

ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య ఊహించని స్దాయిలో నమోదవుతుండటంతో ఆందోళన మొదలైంది.

ఇకపోతే కోవిడ్ బారిన సామాన్యులతో పాటుగా, రాజకీయ ప్రముఖులు కూడా పడుతున్నారు.

సుమారుగా అన్ని రాష్ట్రాల నేతలకు ఇప్పటికే కోవిడ్ నిర్ధారణ జరిగింది కూడా.ఇక మరికొందరు మరణించారు.

ఇదిలా ఉండగా తాజాగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా స్వయంగా అశోక్ గెహ్లట్‌ వెల్లడించారు.కాగా కొవిడ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం తాను హోం ఐసోలేష‌న్‌లో ఉన్నాన‌ని, అయితే ఈ మధ్యకాలంలో తనను కలిసిన వారంతా తప్పని సరిగ్గా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఈ సందర్భంగా కోరారు.ఇకపోతే గెహ్లాట్ భార్య సునీత‌కు కూడా నిన్న బుధ‌వారం క‌రోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందన్న విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube