కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా పీడిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అలాంటి ఈ కరోనా సమయంలో కొన్ని నిబంధనల మధ్య పెళ్లిళ్లు జరుగుతున్నాయి.
ఇంకా అలాంటి ఈ సమయంలో నిబంధనలతో పెళ్లి చేసుకోవడమే డేంజర్.అలాంటిది నిబంధనలు ఉల్లఘించి పెళ్లి చేసుకోవడం ఇంకా ఎంత డేంజర్ ఓ మీరే ఊహించుకోండి.
ఇంకా అలాంటిది 50 మందితో సైలెంట్ గా పెళ్లి చేసుకోండి అని చెప్తే.ఏకంగా వందలమంది అతిథుల మధ్య పెళ్లి చేసుకున్నారు.దానికి ఫలితమే 15 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది.ఇంకా ఈ ఘటన రాజస్థాన్లోని భిల్వారా జిల్లాలో జరిగిందీ.
ఈ నెల 13న గీసులాల్ రాఠీ అనే వ్యక్తి తన కుమారుడికి అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు.
ఆ వివాహానికి హాజరైన 15మందికి కరోనా పాజిటివ్ రావడమే కాకుండా ఒకరు మరణించారు కూడా.
ఇంకా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఈ నెల 22న గీసులాల్పై కేసు నమోదు చేశారు.ఇంకా కరోనా సోకినా 15 మందిని ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాలకు తరలించి చికిత్స అందించారు.అయితే వారికీ పరీక్షల నిర్వహణ, చికిత్స, ఆహారం తదితర కలిపి రూ.6,26,600 అయింది.దీంతో ఈ మొత్తాన్ని గీసులాల్ కుటుంబం నుంచి వసూలు చేసి మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధిలో డిపాజిట్ చేయాలని సూచించారు కలెక్టర్ రాజేంద్ర భట్.