యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ వారసత్వంతో అతని కూతుళ్ళు కూడా హీరోయిన్స్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు.ఇప్పుడు తమని తాము ప్రూవ్ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
పెద్ద కూతురు టూ స్టేట్స్ రీమేక్ తో ఎంట్రీ ఇచ్చిన ఆ సినిమా అర్ధంతరంగా ఆగిపోయింది.ఇప్పుడు కెవి గుహన్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించింది.
ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.ఇదిలా ఉంటే మరో వైపు చిన్న కూతురు శివాత్మిక కూడా దొరసాని సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం ఈ అమ్మడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.
ఇదిలా ఉంటే మరో సినిమాలో కూడా ఈ భామ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది.ఇప్పుడు కోలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది.
సీనియర్ తమిళ హీరో కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తీక్ హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమాలో శివాత్మిక హీరోయిన్గా నటించనున్నారు.నందా పెరియసామి దర్శకత్వం వహించనున్న ఈ ఫ్యామిలీ డ్రామాలో పల్లెటూరి అమ్మాయిగా కనిపించనున్నారు.
లోకల్ టీవీ ఛానెల్లో యాంకర్గా కనిపించే పాత్ర శివాత్మికది.త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది.
ఈ మధ్యకాలంలో కోలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా దూసుకుపోతున్నారు.అక్కడ సినిమాలలో అంజలి, రితూవర్మ, ఆనంది, ఐశ్వర్య రాజేష్ లాంటి తెలుగు అమ్మాయిలదే హవా.ఈ నేపధ్యంలో శివాత్మిక కూడా కోలీవుడ్ లో జెండా పాతేసే అవకాశం ఉందనే టాక్ ఇప్పుడు వినిపిస్తుంది .