టాలీవుడ్ డాషింగ్ అండ్ డైనమిక్ హీరోల్లో గోపీచంద్ ఒకరు.ఈయన మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు సంపాదించుకున్నాడు.
ప్రస్తుతం ఈయన సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటిమార్‘ సినిమా చేస్తున్నాడు.వరుస ప్లాపులతో సతమతమవుతున్న గోపీచంద్ కు ఈ సినిమా కీలకంగా మారింది.
కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో గోపీచంద్ కబడ్డీ లేడీస్ టీమ్ కోచ్ గా పనిచేస్తున్నాడు.ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.
గోపీచంద్ సిటిమార్ సినిమా తర్వాత మారుతీ దర్శకత్వంలో “పక్కా కమర్షియల్” సినిమా చేస్తున్నాడు.గీత ఆర్ట్స్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడడం వల్ల సినిమాలు విడుదల కూడా వాయిదా పడింది.
గోపీచంద్ ఈ సినిమాలతో పాటు శ్రీవాస్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది.
లక్ష్యం, లౌక్యం వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీవాస్ ఇప్పుడు గోపీచంద్ తో సినిమా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది.
అయితే ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ విలన్ పాత్ర ఉందని టాక్ వినిపిస్తుంది.అయితే ఈ పాత్ర కోసం శ్రీవాస్ సీనియర్ హీరో రాజశేఖర్ ను సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి.రాజశేఖర్ ఈ మధ్యనే విలన్ రోల్ కూడా చేస్తానని హింట్ ఇవ్వడంతో శ్రీవాస్ ఆయనను సంప్రదించినట్టు టాక్.
రాజశేఖర్ ఇప్పటికి హీరోగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.కానీ వరుస పరాజయాలు వస్తున్న నేపథ్యంలో రాజశేఖర్ విలన్ పాత్ర చేయడానికి రెడీ అవుతున్నట్టు టాక్ వినిపిస్తుంది.అయితే ఇప్పటి వరకు రాజశేఖర్ కు చాలా సినిమాల్లో విలన్ ఆఫర్స్ వచ్చాయట.
కానీ అంత పవర్ఫుల్ అని అనిపించక పోవడంతో రాజశేఖర్ రిజక్ట్ చేసాడట.అయితే శ్రీవాస్ చెప్పిన పాత్ర రాజశేఖర్ కు నచ్చడంతో ఓకే చెప్పినట్టు సమాచారం.
మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.