యాంగ్రీ స్టార్ రాజశేఖర్ తన సెకండ్ ఇన్నింగ్స్లో సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.గరుడవేగ మొదలుకొని రీసెంట్గా వచ్చిన కల్కి వరకు కాప్ అవతారంలో రాజశేఖర్ ఆడియెన్స్ను మెప్పస్తున్నాడు.
కాగా తన నెక్ట్స్ సినిమాలో రాజశేఖర్ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడట.
సీనియర్ ప్రొడ్యూసర్ రమేష్ ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కనున్న సినిమాలో రాజశేఖర్ లాయర్, ప్రొఫెసర్గా రెండు పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది.
సోషల్ మెసేజ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవల తెలంగాణలో ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యల ఆధారంగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.
సిరా అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా కథ ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉండగా, ఈ సినిమాలో రాజశేఖర్ డ్యుయెల్ రోల్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.