యాంగ్రీ స్టార్ రాజశేఖర్ నటించిన లాస్ట్ మూవీ ‘కల్కి’ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అలరించ లేకపోవడంతో, ఆయన తన నెక్ట్స్ మూవీ కోసం కాస్త గ్యాప్ తీసుకున్నాడు.అయితే తాజాగా రాజశేఖర్ తన నెక్ట్స్ చిత్రాన్ని ఓకే చేసినట్లు తెలుస్తోంది.
అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నీలకంఠ దర్శకత్వంలో రాజశేఖర్ ఓ సినిమా చేసేందుకు పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది.ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా నీలకంఠ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను సి.కళ్యాణ్తో కలిసి జీవితా రాజశేఖర్ స్వయంగా ప్రొడ్యూస్ చేయనుంది.అయితే ఈ సినిమా కోసం ఆమె ఓ పెద్ద రిస్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా కోసం ఏకంగా రూ.20 కోట్ల బడ్జెట్ను ఆమె కేటాయించిందట.రాజశేఖర్ మార్కెట్కు ఈ బడ్జెట్ చాలా ఎక్కువని చెప్పాలి.
అయితే నీలకంఠ చెప్పిన కథ విని ఈ రిస్క్ తీసుకునేందుకు జీవితా రాజశేఖర్ నిర్ణయం తీసుకుందట.ఇక అతి త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
కాగా ఇంత బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి జోనర్తో తెరకెక్కుతుందా, ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తారు, ఈ సినిమాతో రాజశేఖర్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడు అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.మరి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే ఈ సినిమాను ప్రారంభించే వరకు ఆగాల్సిందే.
కాగా ఈ సినిమా కోసం నీలకంఠ చాలా శ్రమిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.గతకొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న నీలకంఠ, ఈ సినిమాతో అదిరిపోరయే హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు.