ఫిబ్రవరి నుంచి రాజశేఖర్ కొత్త సినిమా షూటింగ్ షురూ

యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ ఈ మధ్యనే కరోనా బారిన పడి మళ్ళీ కోలుకున్నారు.ప్రస్తుతం అయన రెస్ట్ తీసుకుంటున్నారు.

 Rajasekhar Joseph Going On Sets February, Tollywood, Telugu Cinema, Corona Effec-TeluguStop.com

కరోనా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో రాజశేఖర్ ఫ్యామిలీ మొత్తం ఊపిరి పీల్చుకుంది.ఇదిలా ఉంటే రాజశేఖర్ నెక్స్ట్ నీలకంఠ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఒకే చెప్పాడు.

మలయాళీ హిట్ మూవీ జోసెఫ్ కి రీమేక్ గా ఈ మూవీ ఉండబోతుంది.క్రైం థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతుంది.

కల్కీ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రాజశేఖర్ మరోసారి అదే తరహా కథతో సినిమా చేయడానికి రెడీ కావడం విశేషం.గరుడవేగ సినిమా తర్వాత రాజశేఖర్ కంప్లీట్ గా రూట్ మార్చి కంటెంట్ బేస్ సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్నాడు.

ఇప్పుడు జోసెఫ్ కూడా అలాంటి జోనర్ లోనే ఉండబోతుంది.

ఇదిలా ఉంటే వరుస ఫ్లాప్ లతో కెరియర్ పరంగా ఢీలా పడ్డ నీలకంఠ ఎలా అయినా ఈ సినిమాతో మళ్ళీ హిట్ కొట్టి తన స్టాండర్డ్ చూపించాలని అనుకుంటున్నాడు.

ఈ నేపధ్యంలో ఇప్పటికే జోసెఫ్ స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టాడు.ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లాలని అనుకున్న రాజశేఖర్ కరోనా బారిన పడటంతో వాయిదా పడిపోయింది.ఈ నేపధ్యంలో యాంగ్రీ మెన్ మొత్తం కోలుకున్న తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసే బెటర్ అని భావిస్తున్నట్లు తెలుస్తుంది.ఈ నేపధ్యంలో ఫిబ్రవరి తర్వాత అప్పటి రాజశేఖర్ కండిషన్ బట్టి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు.

దీనికి రాజశేఖర్ కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.ఇక రాజశేఖర్ హీరోగానే కాకుండా వచ్చే ఏడాది నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కొత్త జర్నీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube