ఫ్లాప్ దర్శకుడుకి ఒకే చెప్పిన రాజశేఖర్

యాంగ్రీ యంగ్ మెన్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న హీరో రాజశేఖర్, ఆయన సినిమాలు అంటే వెంటనే అంకుశం, సింహరాశి, మా అన్నయ్య  లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఎన్నో కనిపిస్తాయి.పోలీస్ ఆఫీసర్ గా మాస్ ఆడియన్స్ ని మెప్పించిన రాజశేఖర్ అదే స్థాయిలో ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా తన సినిమాలతో చేరువ అయ్యాడు.

 Rajasekhar Green Signal To Director Neelakanta, Tollywood, Angry Young Men Rajas-TeluguStop.com

అతని కెరియర్ లో ఒకానొక సమయంలో వరుస సక్సెస్ సినిమాలు చేశాడు.ప్రస్తుతం రాజశేఖర్ మార్కెట్  కొంత వరకు తగ్గిపోయిన రాజశేఖర్ సినిమా వస్తుంది అంటే అన్ని వర్గాల ప్రేక్షకులు  చూడదగ్గ సినిమా అనే గుర్తింపుతో ప్రేక్షకులకి థియేటర్ కి వెళ్ళేవారు.

అయితే ఈ మధ్య కాలంలో హీరోగా కొంత డౌన్ ఫాల్ చేసిన రాజశేఖర్ మరల గరుడ వేగా సినిమాతో తన పవర్ చూపించాడు.తరువాత కల్కి సినిమాతో మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెస్మరైజ్ చేసిన ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అవ్వలేదు.

ఇదిలా ఉంటే తాజాగా పలాస ఫేం కరుణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఇప్పుడు మరో దర్శకుడుకి కూడా ఒకే చెప్పాడు.

  మిస్సమ్మ సినిమాతో అందరిని దృష్టిని తన వైపు తిప్పుకున్న దర్శకుడు నీలకంఠ చెప్పిన కథకి రాజశేఖర్ ఒకే చెప్పాడు.అయితే కమర్షియల్ గా సక్సెస్ లేకుండా పూర్తిగా కనుమరుగైన ఈ దర్శకుడుతో మళ్ళీ రాజశేఖర్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.

ఆ దర్శకుడుకి ఒకే చెప్పి రాజశేఖర్ రిస్క్ చేస్తున్నాడని చాలా మంది నుంచి వినిపించే మాట.అయితే రాజశేఖర్ మాత్రం సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా దర్శకులకి అవకాశం ఇవ్వడంలో ముందు ఉంటాడు.అలాగే నీలకంఠ చెప్పిన కథకి ఒకే చెప్పి ఉంటాడని టాక్ వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube