యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్, జీవితల కూతుళ్లు శివాని, శివాత్మిక టాలీవుడ్ లో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చేశారు.ముందుగా పెద్ద కూతురు శివాని ఎంట్రీ ఇచ్చింది.
అడవి శేష్ కి జోడిగా టూ స్టేట్స్ రీమేక్ చేశారు.అయితే ఏమైందో మధ్యలోనే ఈ సినిమా ఆగిపోయింది.
తరువాత మళ్ళీ స్టార్ట్ కాలేదు.దీంతో ఆమె ఎంట్రీ ఆలస్యం అయిపొయింది.
అయితే రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక సురేష్ ప్రొడక్షన్ లో విజయ్ దేవరకొండ తమ్ముడు హీరోగా తెరకెక్కిన దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి ప్రయత్నంలోనే మంచి మార్కులు కొట్టేసింది.అయితే రొటీన్ ఫార్ములా కథగా సినిమా మిగిలిపోయింది.
ఇప్పుడు శివాత్మిక కృష్ణవంశీ రంగ మార్తాండ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది.మరో వైపు శివాని మొదటి సినిమా ఆగిపోయిన స్టార్ కెమెరామెన్ కెవి గుహన్ దర్శకత్వంలో రెండో సినిమా చేసే అవకాశం కొట్టేసింది.
అదితి అరుణ్, శివాని కాంబినేషన్ లో కెవి గుహన్ రెండో ప్రయత్నంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపొయింది.118 సినిమా ఫ్లాప్ తర్వాత గుహన్ చాలా కసిగా ఈ సినిమా పూర్తి చేశారు.దీంతో ఎలా అయినా హిట్ కొట్టాలని థ్రిల్లర్ కాన్సెప్ట్ ని తీసుకొని తెరకెక్కించారు.
తాజాగా ఈ సినిమాకి సంబందించిన టైటిల్ ని గుహన్ ప్రకటించాడు.డబ్యూడబ్యూడబ్యూ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.
కాస్తా వెరైటీగా ఉన్న టైటిల్ బట్టి సినిమా కంటెంట్ ఎలా ఉండబోతుంది అనే విషయం కూడా అర్ధమవుతుంది.మరి ఈ సినిమాతో శివాని లుక్ తిరిగి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుందేమో చూడాలి.