సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల దర్బార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.తమిళంలో ఈ చిత్రం భారీ వసూళ్లను దక్కించుకుంది.
తెలుగులో దాదాపుగా 15 కోట్ల రూపాయలను బయ్యర్లు నష్టపోయినట్లుగా సమాచారం అందుతోంది.ఈ చిత్రం మొత్తంగా 155 కోట్ల వరకు రాబట్టినట్లుగా సమాచారం అందుతోంది.
అంత భారీ వసూళ్లు రాబట్టినా కూడా పలు ఏరియాల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించలేదు.దాంతో బయ్యర్లు నష్టపోయారట.
200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం 155 కోట్లు వసూళ్లు చేసింది.అంటే దాదాపుగా 45 కోట్ల రూపాయలు బయ్యర్లు నష్టపోయారు.ఆ మొత్తంలో కనీసం సగం అయినా రిటర్న్ ఇవ్వాలంటూ రజినీకాంత్ను బయ్యర్లు వేడుకుంటున్నారు.గతంలో ఇలా నష్టపోయిన బయ్యర్లకు తాను కొంత నిర్మాతతో కొంత నష్టపరిహారం ఇప్పించాడు.
ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి ఏర్పడింది అంటూ తమిళ సినీ మీడియా కోడై కూస్తుంది.
రజినీకాంత్ నటించిన ప్రతి సినిమాకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతున్న నేపథ్యంలో బయ్యర్లు మరియు నిర్మాతలు ఆయనపై నమ్మకం కోల్పోతున్నారు.వరుసగా చిత్రాలు చేస్తున్న రజినీకాంత్ బడ్జెట్ విషయంలో మరియు ప్రీ రిలీజ్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని లేదంటే సినిమా హిట్ అయినా కూడా ఇలాంటి నష్టాల వల్ల సినిమా మార్కెట్ దెబ్బ తినే అవకాశం ఉందంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.