ఇండియాలో టాప్ మోస్ట్ డైరెక్టర్లలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే ముందుండే పేరు రామ్ గోపాల్ వర్మ. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఇలా ఏ వుడ్ అయినా సరే వివాదాలకు ఎదురెలుతుంటారు రామ్ గోపాల్ వర్మ.
రామ్ గోపాల్ వర్మ అంటేనే చాలు అబ్బో ఈయనకున్నంత నోటి దూల మరెవరీకి ఉండదేమో అనిపిస్తుంటుంది.
ఒక సినిమాపై లేదా హీరోపై లేదా హీరోయిన్ పై తనకునచ్చినట్టుగా కామెంట్ చేస్తూ వివాదాల్లో చిక్కుకుంటారు ఈ డైరెక్టర్.
ఈయన తీసిన చాలా సినిమాలు కూడా వివాదాల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే.కాగా ఎప్పుడు ఏదో ఒక దాంట్లో తలదూర్చి నోటికి, చేతులకు పని చెప్పి తిట్టిపించుకునే రామ్ గోపాల్ వర్మ తాజాగా మరొ కొత్త వివాదంలో చిక్కుకున్నారు.
వివరాల్లోకి వెళితే.రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ ను ప్రారంభించారు.
ఈ విషయం అందరికీ తెలిసిందే.కాగా ఈ ఛాలెంజ్ ను రాజమౌళి కూడా పూర్తి చేశారు.
కాగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రామ్ చరణ్, రామ్ గోపాల్ వర్మ, వీవీ వినాయక్, పూరీ జగన్నాథ్లకు ఛాలెంజ్ విసిరినట్టు ట్వీట్ చేశాడు.
దీనికి రామ్ గోపాల్ వర్మ మళ్లీ తన దురుసుతనాన్ని చూపెట్టారు.
అసలకు నాకు ఛాలెంజులు అన్నా, గ్రీన్ అన్నా అస్సలు పడవని చెప్పుకొచ్చారు.మరీ ముఖ్యంగా నాలాంటి స్వార్థపరుడు మొక్కలు నాటడం మందిచి కాదని ఆయన ట్వీట్ చేశారు.
దీనితో మళ్లీ ఆయన వివాదాల్లో చిక్కుకున్నారని అర్థమవుతోంది.నేనింతే, నా మాటింతే అంటూ రామ్ గోపాల్ వర్మ తన నోటి దూలను ప్రదర్శన చూపిస్తుంటారు.
ఏంటో ఈయన వాలకం తేడాగా ఉంటుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.