మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే 40 శాతం షూటింగ్ ముగించుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో, ఆచార్య ఎలా ఉండబోతున్నాడా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
అయితే ఈ సినిమా షూటింగ్ పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుండగా, కరోనా దెబ్బతో మరింత ఆలస్యంగా జరుపుకోనుంది.ఇక ఈ సినిమాను వచ్చే ఏడాదిలో వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
కానీ చాలా తక్కువ మందికి తెలిసిన విషయమేమిటంటే, ఈ సినిమాను డిసైడ్ చేస్తోంది మరో స్టార్ డైరెక్టర్ అని.
అవును.ఆచార్య చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి డిసైడ్ చేస్తున్నాడు.ఈ సినిమాతో జక్కన్నకు ఏం సంబంధం అని అందరూ అనుకుంటారు.కానీ, ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించేందుకు రామ్ చరణ్ ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.చిరు కూడా ఈ సినిమాలోని కేమియో పాత్రలో చరణ్ అయితేనే బాగుంటుందని పట్టుపట్టడంతో ఆయన ఈ సినిమా షూటింగ్లో ఎప్పుడు పాల్గొంటాడా అనేది సస్పెన్స్గా మారింది.
కానీ, చరణ్ ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కావాలంటే, రాజమౌళి పర్మిషన్ తప్పనిసరి.ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తోన్న చరణ్, తన పాత్రకు సంబంధించిన షూటింగ్ను పూర్తి చేశాకే ఆచార్యలో జాయిన్ కావాలి.
దీంతో ఆచార్య భవిష్యత్తు రాజమౌళి చేతులోకి వెళ్లిపోయింది.అటు చిరంజీవి కూడా చరణ్ను ఈ సినిమాలో నటించేందుకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా రాజమౌళిని రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.మొత్తానికి ఆచార్య సినిమాను రాజమౌళి డిసైడ్ చేస్తుండటంతో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్గా మారింది.ఇక ఆర్ఆర్ఆర్ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో, దాన్ని బట్టే ఆచార్య చిత్రం కూడా రిలీజ్ డేట్ను నిర్ణయించుకోనుంది.
ఆర్ఆర్ఆర్కు పోటీగా ఆచార్య చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ కాకుండా చిత్ర యూనిట్ జాగ్రత్త పడుతున్నారు.కాగా ఆచార్య చిత్రంలో మెగాస్టార్ సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోండగా, ఈ సినిమాను నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.