దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్తో యమ బిజీగా ఉన్నాడు.ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జక్కన్న, తారక్-చరణ్లతో కలిసి ఈ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న రాజమౌళి తన నెక్ట్స్ మూవీగా ఎలాంటి చిత్రాన్ని తెరకెక్కిస్తాడా అనే ఆసక్తి అప్పుడే జనంలో మొదలైంది.
కాగా బాహుబలి వంటి భారీ బడ్జెట్ తరువాత ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తు్న్న జక్కన్న, తన నెక్ట్స్ మూవీగా ఓ చిన్న బడ్జెట్ సినిమాను తీసే ఆలోచనలో ఉన్నాడట.
దీనికి సంబంధించిన స్క్రిప్టు పనులు తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ అప్పుడే పూర్తి చేసే పనిలో పడ్డాడని తెలుస్తోంది.ఈ కథను ఓ చిన్న సినిమాకు ఉపయోగించే విధంగా ఆయన రెడీ చేస్తున్నట్లు చిత్ర వర్గాల టాక్.
మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ భారీ బడ్జెట్ చిత్రాల తరువాత జక్కన్న ఇలా చిన్న బడ్జెట్ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో సైతం అప్పుడే అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.కాగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని 2021 జనవరి 8న రిలీజ్ చేస్తున్నట్లు రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే.