త్వరలో రిలీజ్ అవబోతున్న RRR సినిమాకు భారీ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు.ఈ క్రమంలో సోమవారం చెన్నైలో ట్రిపుల్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
ఈ ఈవెంట్ లో భాగంగా రాజమౌళి ఎన్.టి.ఆర్ గురించి ఓ రేంజ్ లో మాట్లాడాడు.తారక్ తనకు మంచి స్నేహితుడని.తారక్ లాంటి నటుడు దొరకడం తెలుగు సినిమాకే కాదు.ఇండియన్ సినిమా అదృష్టమని అన్నారు.తన మనసులో ఒక సీన్ అనుకుని తనకు చెప్పగా తను ఏదైతే అనుకున్నానో దాన్ని మించి తారక్ చేసి చూపిస్తాడని అన్నారు రాజమౌళి.
చరణ్ తన శిష్యుడని.చరణ్ ని చూసి సెక్యూర్ గా ఉండటం తాను నేర్చుకున్నానని అన్నారు రాజమౌళి.మనసులో ఎలాంటి టెన్షన్ లేకుండా చేయాల్సిన పని మీద శ్రద్ధ ఉండటం మంచి విషయమని.
అది చరణ్ ని చూసి తాను నేర్చుకున్నానని అన్నారు రాజమౌళి. ఇద్దరు స్టార్స్ తో కలిసి సినిమా చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.
ఇక ఆర్.ఆర్.ఆర్ ఎక్కడ ఈవెంట్ జరిగినా మెగా నందమూరి ఫ్యాన్స్ వచ్చేస్తున్నారని.మేము అండమాన్ నికోబార్ దీవుల్లో ఈవెంట్ పెడతాం అక్కడకు వస్తారా.
చందమామలో ఈవెంట్ పెడతాం అక్కడకు వస్తారా అని ఫ్యాన్స్ ని ఉద్దేశించి సరదాగా అన్నారు రాజమౌళి.