దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మిగతా షూటింగ్ను లాక్డౌన్ పూర్తవ్వగానే పూర్తి చేయాలని జక్కన్న అండ్ టీమ్ భావిస్తోంది.
కానీ వారు అనుకున్న సమయానికంటే ఎక్కువగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.
అయితే ప్రస్తుతం లాక్డౌన్ సడలింపులు జరుగుతున్న సమయంలో సినిమా షూటింగ్లు కూడా నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని టాలీవుడ్ ప్రముఖులు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.
అయితే ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఈ విషయంపై స్పష్టత ఇస్తారని చిత్ర వర్గాలకు ప్రభుత్వం సూచించింది.కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు, షూటింగ్ చివరి దశలో ఉన్న సినిమాలు తమ పనులు పూర్తి చేసుకోవాలని చిత్ర వర్గాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
దీంతో టాలీవుడ్లో ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకునే చిత్రాల్లో ఒకటైనా ఆర్ఆర్ఆర్లో చిన్న సీన్స్కు సంబంధించిన షూటింగ్ను ముగించాలని జక్కన్న చూస్తున్నాడు.ఈ మేరకు ఏర్పాట్లు కూడా రెడీ చేస్తున్నాడట జక్కన్న.
దీంతో ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ను వీలైనంత త్వరగా పూర్తి చేసేయాలని, ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా మారేందుకు సమయం ఉంటుందని జక్కన్న అండ్ టీమ్ ఆలోచిస్తున్నారు.మరి లాక్డౌన్ తరువాత ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఎంత త్వరగా పూర్తి చేసుకుంటుందో చూడాలి అంటున్నారు.
ఇక ఈ సినిమాను వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.