రాజమౌళి దర్శకత్వంలో చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు చాలా సమయం ఉన్నప్పటికీ ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, అజయ్ దేవగణ్, హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు.
జీ స్టూడియోస్ సంస్థ ఆర్ఆర్ఆర్ శాటిలైట్, డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది.ఈ డీల్ విలువ ఏకంగా రూ.325 కోట్లు కావడం గమనార్హం.
ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందా.? అని ఎదురు చూస్తుండగా కరోనా, లాక్ డౌన్ వల్ల ఈ సినిమా రిలీజ్ అంతకంతకూ ఆలస్యమవుతూ ఉండటం గమనార్హం.శాటిలైట్, డిజిటల్ హక్కుల ద్వారా ఆర్ఆర్ఆర్ 325 కోట్ల రూపాయలు సాధించడం సాధారణ విషయం కాదని చెప్పాలి.
ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ద్వారా కొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంది.ఆర్ఆర్ఆర్ నిర్మాతల నుంచి పెన్ స్టూడియోస్ సంస్థ శాటిలైట్, డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది.
ఆ సంస్థ నుంచి ఆర్ఆర్ఆర్ శాటిలైట్, డిజిటల్ హక్కులు జీ స్టూడియోస్ సొంతమయ్యాయి. బాహుబలి 2 సినిమాలతో రాజమౌళి సృష్టించిన ఎన్నో రికార్డులు ఇప్పటికీ చెక్కు చెదరలేదు.రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆ రికార్డులను బ్రేక్ చేసి కొత్త రికార్డులను క్రియేట్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.మరోవైపు ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ నెలకొంది.
మరికొన్ని రోజుల్లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.సినిమాకు కొన్ని రోజుల ముందు ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ను రిలీజ్ చేయాలని రాజమౌళి భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ మూవీలో రామ్ చరణ్ సీతారామరాజు పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ భీమ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.