టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ తెరకెక్కుతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్‘.ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.రాజమౌళి సినిమాలంటే అంచనాలు పీక్స్ లో ఉంటాయి.ఇక ఈ సినిమాలో టాలీవుడ్ ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నాడు.
ఈ సినిమా ఈ మధ్యనే షూట్ పూర్తి చేసుకుందని వార్తలు అయితే వచ్చాయి కానీ అధికారికంగా మాత్రం ప్రకటన అయితే చెయ్యలేదు.
తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త మీడియాలో వైరల్ అవుతుంది.ఈ సినిమాలో రాజమౌళి ఒక కీలక భాగాన్ని మళ్ళీ రీషూట్ చెయ్యాలని అనుకుంటున్నాడట.తారక్ విదేశీ భామ మధ్య వచ్చే లవ్ ట్రాక్ పై రాజమౌళి అసంతృప్తిగా ఉన్నారని సమాచారం.
అందుకే వీరి మధ్య వచ్చే సన్నివేశలను రీషూట్ చేయబోతున్నారట.
ఒక బ్రిటిష్ మహిళ గిరిజన నాయకుడు అయినా కొమరం భీం ను ప్రేమిస్తుంది కాబట్టి ఈ సినిమాలో వీరి ప్రేమ కథ హైలెట్ గా నిలవాలని రాజమౌళి భావిస్తున్నారట.కానీ ఈ లవ్ ట్రాక్ అనుకున్న విధంగా రాలేదట.అందుకే ఈ లవ్ ట్రాక్ ను మళ్ళీ రీషూట్ చేయాలనీ నిర్ణయించు కున్నారట.
ఇటీవలే తారక్ ఒలివియా మోరిస్ మధ్య లవ్ ట్రాక్ ను గమనించిన రాజమౌళికి ఈ పార్ట్ అంత బాగా రాలేదని అందుకు రీషూట్ చేయడానికి టీమ్ ను రెడీ చేస్తున్నాడని టాక్.ఇక ఇందులో చరణ్ కు జోడీగా ఆలియా భట్ నటిస్తుంటే.ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరీస్ నటిస్తుంది.
ఈ సినిమాను డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఇక ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.