రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ లాక్ డౌన్ కారణంగా మూడు నెలల క్రితం ఆగిపోయిన విషయం తెల్సిందే.మళ్లీ ఎట్టకేలకు షూటింగ్కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో రాజమౌళి షూటింగ్కు సిద్దం అయ్యాడు.
గండిపేటలో ఇప్పటికే వేసిన సెట్టింగ్లో రాజమౌళి షూటింగ్ చేయబోతున్నాడు. రాజమౌళి గతంలో మాదిరిగా చాలా మంది నటీనటులు సాంకేతిక నిపుణులతో కాకుండా కేవలం 50 మంది లోపు యూనిట్ సభ్యులతో సినిమా షూటింగ్ చేయబోతున్నాడు.
గండిపేటలో ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈనెల 25వ తారీకు నుండి ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ను పున: ప్రారంభించేందుకు అంతా సిద్దం అయ్యింది.మొదటి రెండు రోజులు రామ్ చరణ్ ఇంకా చరణ్ లేకుండానే షూటింగ్ జరుపనున్నారు.ఆ తర్వాత వారిద్దరు కూడా షూటింగ్లో జాయిన్ కాబోతున్నారు.
షూటింగ్ను ఇకపై చాలా స్పీడ్గా నిర్వహించాలని రాజమౌళి భావిస్తున్నాడట.
సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం అక్టోబర్ వరకు షూటింగ్ను పూర్తి చేసేయాలని రాజమౌళి ప్లాన్ చేసుకున్నాడట.భారీ యుద్ద సీన్స్ మరియు కొన్ని ఒలివియా సీన్స్ మినహా షూటింగ్ మొత్తం అక్టోబర్లో పూర్తి చేసి మిగిలిన షూట్ను వచ్చే ఏడాదిలో వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత చేసే అవకాశాలున్నాయి అంటున్నారు.సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడం అసాధ్యం అని, జులై నెలలో సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.
అంటే ఇంకా సంవత్సరం సమయం ఉందన్నమాట.