రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ లో చిరంజీవికి కూడా చోటు

టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అనే విషయాన్ని ఎప్పుడో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.తన చివరి సినిమా కూడా అదే అవుతుందని కూడా ఓ సందర్భంలో జక్కన్న చెప్పాడు.

 Director Rajamouli Plan To Take Up Chiranjeevi For Mahabharata, Tollywood, Rrr M-TeluguStop.com

అయితే ఆ మూవీ చేయడానికి మరో పదేళ్ళ సమయం పడుతుందని ఇప్పుడు పడుతున్న కష్టం కంటే పదింతలు ఎక్కువగా దానికోసం పనిచేయాల్సి ఉంటుందని కూడా క్లారిటీ ఇచ్చాడు.ఇక మహాభారతం మొత్తం కథని నాలుగు భాగాలుగా చెప్పే ప్రయత్నం చేస్తానని చెప్పారు.

పాన్ ఇండియా రేంజ్ లో ఏకంగా వెయ్యి కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ ప్లాన్ చేయనున్నారు.ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా కంప్లీట్ అయిన తర్వాత జక్కన్న ఈ మూవీ స్టార్ట్ చేసే అవకాశం ఉంది.

ఇక మహాభారతం సినిమా చిత్రీకరణ అంతా కూడా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలోనే చిత్రీకరించడానికి రాజమౌళి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.దీనికోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ ని వినియోగించడంతో ఆర్టిస్ట్ లని కూడా ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా స్టార్ క్యాస్టింగ్ ని ఎంపిక చేసుకోవాలని అనుకుంటున్నట్లు బోగట్టా.

ఇదిలా ఉంటే ఇక మహాభారతం కథలో మెగాస్టార్ చిరంజీవిని కూడా ఓ కీలక పాత్ర కోసం తీసుకోవాలని రాజమౌళి ప్లానింగ్ లో ఉందని తెలుస్తుంది.అలాగే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎన్టీఆర్ లని కూడా సినిమాలని భాగం చేయాలని అనుకుంటున్నట్లు బోగట్ట.

మరి రాజమౌళి మహాభారతంలో మెగాస్టార్ భాగం అవ్వడానికి ఇష్టపడతాడో లేదో అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube