దర్శకధీరుడు రాజమౌళి టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు జక్కన్న రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందా అనే ఆసక్తి అందరిలో మొదలైంది.కాగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ సినిమాను తొలుత 2020 జూలై 31న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.కానీ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.
దీంతో ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2021 జనవరి 8న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.కానీ కరోనా వైరస్ కారణంగా రెండు నెలలకు పైగా సినిమా షూటింగ్లకు బ్రేక్ పడటంతో ఈ సినిమా రిలీజ్ మళ్లీ వాయిదా పడింది.
ఈ సినిమాను వచ్చే వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
కానీ ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కావడానికి మరింత సమయం పడుతుండటంతో ఈ సినిమా రిలీజ్ను మరింత వాయిదా వేస్తూ 2021 జూలై 31న రిలీజ్ చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.
అంటే ఈ సినిమాను తొలుత రిలీజ్ చేయాలని అనుకున్న తేదీ నుండి ఏకంగా ఏడాది పాటు వాయిదా వేశారు.ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.
ఏదేమైనా జక్కన్న చెప్పిన రిలీజ్ డేట్ నుండి ఈ సినిమా ఏడాదికి వాయిదా పడటంతో ఈ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ను దక్కించుకుంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, ఒలివియా మారిస్లు కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.