తెలుగు చలనచిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి అందరికీ తెలిసిందే.టాలీవుడ్ లో రాజమౌళి అగ్ర దర్శకులలో ఒకడిగా నిలిచారు.స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ప్రతి ఒక్క సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్న రాజమౌళి.2001 స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మొదటి సారిగా తన దర్శకత్వంను పరిచయం చేశాడు.
బాహుబలి సినిమాలలో తనదైన శైలిలో దర్శకత్వం వహించి జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకున్నారు.అంతేకాకుండా హీరో నాని తో కలసి చేసిన ఈగ సినిమా గురించి అందరికీ తెలిసిందే.
ఈ సినిమాల్లో తను చూపించిన గ్రాఫిక్స్ అంతా ఇంతా కాదు.ఇదిలా ఉంటే రాజమౌళి ప్రస్తుతం మల్టీస్టార్ ల సినిమాలలో ఆసక్తి చూపుతున్నాడు.
ప్రస్తుతం స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో కలిసి ఆర్ ఆర్ ఆర్ సినిమాలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా ఈ ఏడాది విడుదల చేయడానికి రాజమౌళి ప్లాన్ లో ఉన్నారు.
అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ సినిమాకు హీరోయిన్లను రాజమౌళి బాలీవుడ్ భామలను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రస్తుతం పూర్తవడానికి సిద్ధంగా ఉంది.ఇక రాజమౌళి ఓ సినిమా దర్శకత్వం లోనే ఉండగానే మరో సినిమా గురించి ఆలోచిస్తూ ఉంటారు.ప్రస్తుతం కూడా ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నా తర్వాతి సినిమా గురించి ఓ స్పష్టత తీసుకువచ్చాడు.
తాను తర్వాత తీయబోయే సినిమా చత్రపతి శివాజీ గా తెలిపాడు.ఈ సినిమాలో మహేష్ బాబు తో ఒప్పందం కుదరగా.ఈ సినిమాను కూడా మల్టీ స్టార్ లతో తీయాలనుకుంటున్నారు రాజమౌళి.ఈ విధంగా రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో మరో హీరోను పరిచయం చేయనున్నాడు.
ఇక హీరో గురించి పూర్తి వివరాలు తెలపకపోగా.మొత్తానికి మల్టీస్టార్ లతో సినిమా తీయాలని ఉన్నాడు రాజమౌళి.