గత ఏడాది మన తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా చేసిన మ్యాజిక్ గురించి అందరికి తెలుసు.మరి ఆ సినిమా ఏంటో తెలుసు కదా.
ఆర్ఆర్ఆర్. రాజమౌళి(Rajamouli,) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియన్ వ్యాప్తంగా అందరిని కట్టి పడేసింది.
రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 1200 కోట్లు వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇక ఇప్పుడు మరో ఘనత సాధించింది.
యావత్ ఇండియా మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డ్స్ లో ఈసారి ట్రిపుల్ ఆర్ సినిమా కూడా భాగం అయ్యింది.ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు అనే సాంగ్ కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ రావడం ఇప్పటికి అందరికి కల లాగానే ఉంది.
మన తెలుగు సినిమా ఆస్కార్ అవార్డు గెలుచుకుని కొత్త చరిత్ర సృష్టించింది అనే చెప్పాలి.
మరి ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు అందుకోవడంతో రాజమౌళిపై మరోసారి ప్రశంసల జల్లు కురుస్తుంది.ఈ మూమెంట్ లో ఈయన చేయబోతున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అందరిలో మరింత ఆసక్తి పెరిగింది.ఆర్ఆర్ఆర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా అగ్ర డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అనే విషయం తెలిసిందే.
ఇప్పుడు ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగింది.గ్లోబల్ వైడ్ గా ఈసారి రాజమౌళి తన నెక్స్ట్ సినిమాను అత్యున్నత స్థాయిలో తెరకెక్కించ బోతున్నాడు.ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్(Vijayendra Prasad ) స్టోరీపై కసరత్తు చేస్తున్నాడు.మహేష్ బాబు కెరీర్ లో మొదటి పాన్ ఇండియన్ సినిమా కావడంతో ఈ సినిమాపైనే అందరి కళ్ళు పడ్డాయి.
మరి జక్కన్న మహేష్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో వేచి చూడాల్సిందే.ఇక దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.మరి ఈ భారీ ప్రాజెక్ట్ లాంచింగ్ ఎప్పుడు ఉంటుందో వీచు చూడాలి.