ఆయన ఏ సినిమా తీసినా అదో పెద్ద సెన్సేషన్.ఎందుకంటే ఆయన తీసిన సినిమాలన్నీ కూడా ఇండస్ట్రీ రికార్డులను ఎప్పుడు బద్దలు కొడుతూ ఉంటాయి.
ఇక ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఓటమి ఎరుగని దర్శకుడు గా కొనసాగుతున్నారు.ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అని అనుకుంటున్నారా.
ఇంకెవరూ దర్శక ధీరుడు రాజమౌళి.దర్శక ధీరుడు రాజమౌళి క్రేజ్ బాహుబలి కి ముందు బాహుబలి తర్వాత అని చెప్పాలి.
ఎందుకంటే బాహుబలి సినిమా వరల్డ్వైడ్ హిట్ తర్వాత రాజమౌళి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.ఇక అప్పటి నుంచి ఆయన చేసే ప్రతి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉన్నారు.
ఈ క్రమంలోనే బాహుబలి రికార్డ్స్ ను తలదన్నే విధంగా ఆర్ఆర్ఆర్ అనే ఒక భారీ ప్రాజెక్టును తెరకెక్కించాడు రాజమౌళి.ఈ సినిమా కోసం ఏకంగా ఒక్కరు కాదు ఇద్దరు స్టార్ హీరోలు బరిలోకి దింపాడు.
ఇక ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ షూటింగ్ కూడా పూర్తి చేశాడు.అటు ప్రేక్షకుల నుంచి కూడా అంతకు మించి అనే రేంజ్ లోనే ఆదరణ వచ్చింది.
కానీ కరోనా వైరస్ కారణంగా విడుదల అవుతుంది అనుకొన్న త్రిబుల్ ఆర్ సినిమా కాస్త వాయిదా పడింది.దీంతో రాజమౌళి మళ్లీ నిరాశ లో మునిగిపోయారు.
అయితే రాజమౌళి ఒక సినిమా చేస్తున్న సమయంలో ఇంకో ప్రాజెక్టు గురించి అస్సలు ఆలోచించరు.అటు హీరోలను కూడా మరో సినిమా చేయడానికి అనుమతించరు.
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై సూపర్ సక్సెస్ అయి ఉంటే ఇక రాజమౌళి ఈ సక్సెస్ మేనియాలో మునిగి తేలుతూ ఉండేవారేమో.కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా వాయిదా పడడంతో ఇక ఇప్పుడు మరో సినిమా కోసం రాజమౌళి ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది.ట్రిపుల్ ఆర్ సినిమా కోసం ఆలోచించకుండా మహేష్ బాబుతో సినిమా కోసం ప్రస్తుతం కసరత్తులు మొదలుపెట్టారట జక్కన్న.
దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అయితే ఎన్ని రోజులనుంచి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తోందని టాక్ వినిపిస్తున్నప్పటికీ ఇక మిగతా సినిమాలు లైన్ లోకి రావడంతో ఇక వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వాయిదా పడుతూ వస్తుంది.కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా మరికొన్ని రోజులలో పట్టా లెక్కించడం పైనే రాజమౌళి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.