ఎప్పుడు షూటింగ్స్తో ఇతరత్ర సినిమా పనులతో బిజీగా ఉండే సినీ ప్రముఖులు కరోనా కారణంగా భయం గుప్పిట్లో బిక్కు బిక్కు మంటూ ఇంటికే పరిమితం అవుతున్నారు.చాలా మంది స్టార్స్ ఇంటి నుండి కనీసం బయట కాలు కూడా పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదు.
ఇలాంటి సమయంలో కొందరు మాత్రం షూటింగ్స్ చేస్తున్నారు.హైదరాబాద్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.
సినీ ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు.
హైదరాబాద్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాజమౌళి కీలక నిర్ణయం తీసుకున్నారు.
తన భార్య పిల్లలతో పాటు కుటుంబ సభ్యులను తీసుకుని ఫామ్ హౌస్కు వెళ్లి పోవాలని నిర్ణయించుకున్నాడట.హైదరాబాద్లో ప్రస్తుతం ఉండలేని పరిస్థితి ఉందని ఆయన అంటున్నాడట.సిటీకి దాదాపుగా నాలుగు పదుల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫామ్ హౌస్లో రాబోయే రెండు నెలలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని, తనకున్న కొద్ది పాటి ఫార్మింగ్ను చూసుకోవాలని భావిస్తున్నాడట.
పలువురు స్టార్స్ ఇప్పటికే సిటీకి దూరంగా ఉంటున్నారు.ఇప్పుడు జక్కన్న వంతు.కొన్ని రోజుల క్రితం ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ను గండిపేటలో ప్రారంభించబోతున్నట్లుగా పేర్కొన్న జక్కన్న ఇప్పుడు అసలు హైదరాబాద్లోనే ఉండకుండా వెళ్లి పోవాలనే నిర్ణయానికి రావడం విడ్డూరంగా ఉందంటూ ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.