గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బాహుబలి’ సినిమా సంచలన కలెక్షన్స్తో దూసుకు పోతుంది.ఈ సినిమా ఎక్కువ శాతం రామోజీ ఫిల్మ్ సిటీలో తెరకెక్కిన విషయం తెల్సిందే.
దర్శకుడు రాజమౌళి పలు సార్లు రామోజీ ఫిల్మ్ సిటీ లేకుంటే ఇంత భారీ చిత్రం ఇంత త్వరగా అయ్యేది కాదేమో అని అన్నాడు.ఇక కొన్ని సార్లు ఈ సినిమాలో రామోజీరావు పెట్టుబడి కూడా పెట్టాడు అనే టాక్ వచ్చింది.
తాజాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ను నిర్మాతలు రామోజీ రావుపై గౌరవంతో తక్కువ మొత్తానికి ఇవ్వాలని భావించారనే టాక్ వచ్చింది.
‘బాహుబలి’ శాటిలైట్ రైట్స్ తాజాగా భారీ మొత్తానికి మాటీవీ దక్కించుకుంది.
ఈ నేపథ్యంలో కొత్త వార్త ఒకటి ఫిల్మ్ సర్కిల్స్లో తెగ ప్రచారం జరుగుతోంది.రామోజీ రావు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ వద్దన్నట్లుగా తెలుస్తోంది.
నిర్మాతలు తక్కువ మొత్తానికి ఈటీవీకి ఈ హక్కులు ఇచ్చేందుకు సిద్ద అయినా కొన్ని లెక్కలు వేసుకుని రామోజీ రావు తిరస్కరించినట్లుగా చెబుతున్నారు.‘బాహుబలి’ వంటి విజువల్ వండర్ మూవీని ప్రేక్షకులు బుల్లి తెరపై చూడటానికి ఇష్టపడరు.
ఆ సినిమా బిగ్ స్క్రీన్పై చూస్తేనే బాగుంటుంది.అటువంటిది బుల్లి తెరపై ఈ సినిమాను ఒక్కసారికి మించి ప్రేక్షకుల చూడలేరు.
అందుకే టీఆర్పీ ఎక్కువగా రాదు అనే లెక్కలు వేసుకున్న రామోజీ శాటిలైట్ రైట్స్ ఆఫర్ను తిరస్కరించాడని అంటున్నారు.