‘బాహుబలి’ సినిమా విడుదలై ప్రభంజనంలా కలెక్షన్స్ను రాబడుతోంది.మొదటి వారం రోజుల్లో ఈ సినిమా 250 కోట్ల వరకు కలెక్షన్స్ను రాబట్టినట్లుగా చెబుతున్నారు.
మరో వారం రోజు పాటు ఈ కలెక్షన్స్ ప్రభంజనం ఉండే అవకాశాలున్నాయి.ఈ నేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు రాజమౌళి తన ఫ్యామిలీతో టూర్ వెళ్లాడు.
గత కొంత కాలంగా ‘బాహుబలి’ సినిమాతో బిజీగా గడిపిన జక్కన్నకు ఇంత కాలానికి విశ్రాంతి దొరికింది.గత కొన్ని నెలలుగా ఊపిరి మెసలకుండా ఉన్న జక్కన్న ఫ్యామిలీతో పాటు ఫారిన్ చెక్కేశాడు.
సెప్టెంబర్ నుండి ‘బాహుబలి’ రెండవ పార్ట్ చిత్రీకరణ జరపాల్సిన నేపథ్యంలో 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకుని వచ్చే నెల నుండి రెండవ పార్ట్ షూటింగ్పై దృష్టి పెట్టాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇంత కాలానికి కుటుంబంకు జక్కన్న టైం కేటాయించడంతో ఆయన కూతురు యమూక, భార్య రమా రాజమౌళి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా గత కొంత కాలంగా ‘బాహుబలి’ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు.ఆయన కూడా విశ్రాంతి తీసుకోనున్నాడు.