ఏపీ టికెట్ల రేట్ల వ్యవహారం పై తెలుగు సినీ పెద్దల నుండి అసంతృప్తి వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.నిర్మాతల మండలి తమ ప్రయత్నాలు చేస్తుండగా ఈ విషయంపై దర్శక ధీరుడు రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా టికెట్ల రేటు విషయంపై తన అభిప్రాయాన్ని చెప్పారు జక్కన్న.ఈ ఇష్యూపై ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న రాజమౌళి మొదటిసారి తన కామెంట్ వినిపించారు.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో టికెట్ల రేట్ల వ్యవహారంపై తను రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ తో ఏకీభవిస్తానని అన్నారు జక్కన్న.తనకు ఈ రాజకీయాలు పెద్దగా తెలియదని.
అయితే ఒక ప్రొడక్ట్ ని తయారు చేసేవాడికి ఎలా అయితే దాని ధరను నిర్ణయించుకునే హక్కు ఉంటుందో సినిమా విషయంలో కూడా అంతే అని.ఇది కేవలం ఇండస్ట్రీ వ్యక్తిగా మాత్రమే నేను చెబుతున్నానని అన్నారు రాజమౌళి.దీనికి ఉదహరణగా చెబుతూ టిఫిన్ అనేది అన్ని హోటల్స్ లో ఒకటే ఉండొచ్చు కాని హోటల్ ని బట్టి ధర ఉంటుందని.సినిమా కూడా అలాంటిదే అని ధర నచ్చితేనే టికెట్ కొని ప్రేక్షకుడు సినిమా చూస్తాడని.
లేకపోతే లేదని అన్నారు రాజమౌళి.