ఎన్టీఆర్ ఒక వైపు సినిమాలు చేస్తూనే మరొక వైపు ‘ఎవరు మీలో కోటీశ్వరులు‘ షో ద్వారా మన ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఎన్టీఆర్ షో చేయడం కొత్తేమి కాదు ఇంతకు ముందు బిగ్ బాస్ షో లో వ్యాఖ్యాతగా వ్యవహరించి తన యాంకరింగ్ కు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు వేయించుకున్నాడు.
ఇక ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు షో ను క్లిక్ చేయడానికి ఎన్టీఆర్ తనవంతు కృషి చేస్తున్నారు.,/br>
కానీ ఈ షో వల్ల జెమిని టివి రేటింగ్స్ అయితే పెరగడం లేదు కానీ ఎలాగైనా ఈ షో ను టాప్ లో నిలబెట్టాలని అటు ఎన్టీఆర్ ఇటు జెమిని టివి యాజమాన్యం తీవ్రంగా కృషి చేస్తున్నారు.
అందుకోసం స్టార్ అతిధులను రంగం లోకి దించుతున్నారు.ఇప్పుడిప్పుడే ఈ షో రేటింగ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ స్పెషల్ గెస్ట్ లు రాబోతున్నారని తెలుస్తుంది.
ఎప్పటి నుండో ఈ షో కోసం రాజమౌళి వస్తున్నాడంటూ ప్రచారం జరుగుతుంది.ఈ షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోలో రాజమౌళి కనిపించడంతో ఈ పుకారు అప్పటి నుండి మీడియాలో వినిపిస్తుంది.అయితే ఈ పుకారు వచ్చి మూడు వారాలు అవుతున్న ఇంకా రాజమౌళి రాకపోవడంతో ఇది ఒక పుకారు గానే మిగిలి పోయింది.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ షో కు రాజమౌళి వస్తున్నాడట.
ఆ ఎపిసోడ్ రేపు సోమవారం నాడు ప్రసారం కాబోతుందని టాక్.అయితే ఈ షో లో కేవలం రాజమౌళి మాత్రమే కాకుండా కొరటాల శివ కూడా గెస్ట్ గా వస్తున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.ఇక ఈ ఎపిసోడ్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.ఈ ఇద్దరు దర్సకులు ఎన్టీఆర్ తో సినిమాలు చేస్తున్నారు.ఇప్పటికే రాజమౌళి ఎన్టీఆర్ తో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేయగా కొరటాల శివ ఇప్పటికే జనతా గ్యారేజ్ సినిమా చేసాడు.ఇప్పుడు మరొక సినిమా కోసం రెడీ అయ్యాడు.