యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత వరస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో సలార్ కూడా ఒకటి.
కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.సలార్ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది.
శృతి హాసన్ ఈ సినిమాలో జర్నలిస్ట్ గా నటిస్తుంది.ప్రభాస్ తొలిసారి శృతి హాసన్ తో నటిస్తున్నాడు.
వీళ్ళ కెమిస్ట్రీ తెర మీద ఎలా ఉంటుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలే కాదు రొమాంటిక్ సన్నివేశాలు కూడా పీక్స్ లో ఉంటాయని సమాచారం.
భాస్, శృతి హాసన్ మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని చిత్ర యూనిట్ తెలిపింది.ఇప్పటికే ఈ సినిమా దాదాపు 40 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.
అయితే తాజాగా ఈ సినిమా నుండి ఒక లేటెస్ట్ అప్డేట్ ఒకటి అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.
రేపు ఉదయం 10 గంటల 30 నిముషాలకు ఈ సినిమా నుండి రాజమన్నార్ రివీల్ చేయబోతున్నాం అంటూ ఒక అప్డేట్ వదలడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.మరి రాజమన్నార్ పాత్ర ఎలా ఉండబోతుందో అది ఎవరిదో అనే విషయం తెలియాలంటే మాత్రం రేపటి వరకు వెయిట్ చెయ్యాల్సిందే.
మరి ఇంత హై వోల్టేజ్ మూవీ లో ప్రభాస్ ను ఎలా చూపించ బోతున్నాడో అని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.మరి రాజమన్నార్ ను ఎలా పరిచయం చేస్తాడో మరి కొన్ని గంటల్లోనే తెలిసి పోతుంది.ఇక ప్రభాస్ ఈ సినిమాతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నాడు.