టాలీవుడ్లో ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించడంలో సక్సె్స్ అయ్యాడు.ఇక కుమారి 21 ఎఫ్ చిత్రంతో రాజ్ తరుణ్ లవర్ బాయ్ ఇమేజ్ను సొంతం చేసుకుని తన కెరీర్ను పీక్స్కు తీసుకెళ్లాడు.
కానీ ఆ తరువాత సినిమాల ఎంపికలో చాలా తప్పులు చేస్తూ వరుసగా ఫ్లాప్ సినిమాలను మూటగట్టుకున్నాడు.ఈ క్రమంలో రాజ్ తరుణ్ ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఒరేయ్ బుజ్జిగాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.
పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్ తరుణ్ పాత్ర ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని చిత్ర యూనిట్ అంటోంది.కాగా ఈ సినిమాలో మాళవికా నాయర్, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా నటిస్తుండగా ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.
కానీ కరోనా వైరస్ కారణంగా నెలకొన్న లాక్డౌన్ వల్ల థియేటర్లు మూతపడటంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.
అయితే ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించక పోవడంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.
ఓటీటీల నుండి మంచి ఆఫర్ వస్తుండటంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని, ఇలా చేస్తే సినిమాకు మంచి ఆదరణ లభిస్తుందని వారు ఆశిస్తున్నారు.విజయ్ కుమార్ కొండా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.