టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ లో నటించి ఆ తరువాత హీరోగా అవకాశాలు సంపాదించి వరుస హిట్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.మొదట్లో రాజ్ తరుణ్ నటించిన సినిమాలన్నీ హిట్లైనా ఆ తరువాత కథల ఎంపికలో చేస్తున్న తప్పుల వల్ల వరుస ఫ్లాపులతో రాజ్ తరుణ్ కెరీర్ లో ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాడు.
గత వారం రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా ఆహా ఓటీటీలో విడుదలైంది.
ఒరేయ్ బుజ్జిగా సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా సినిమాలో కామెడీ పుష్కలంగా ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రాజ్ తరుణ్ ఒక టీవీ షోకు హాజరై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.డైరెక్టర్ అవుదామని వచ్చిన రాజ్ తరుణ్ అనుకోని కారణాల వల్ల హీరో అయ్యాడు.
అక్కినేని నాగార్జున బ్యానర్ లో రాజ్ తరుణ్ నటించిన ఉయ్యాల జంపాల సినిమాలో హీరోగా రాజ్ తరుణ్ ప్రస్థానం మొదలైంది.
ఆ తరువాత సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ సినిమాలు రాజ్ తరుణ్ ను మినిమం గ్యారంటీ హీరోగా నిలబెట్టాయి.
వైజాగ్ కు చెందిన రాజ్ తరుణ్ కెరీర్ మొదట్లో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే క్రమంలో ఆకలి బాధలు అనుభవించారట.కొంతకాలం అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన రాజ్ తరుణ్ ఉండటానికి చోటు లేక, తినడానికి తిండి లేక కష్టాలను అనుభవించాడట.
డబ్బు కోసం పెట్రోల్ బంకులో కూడా పని చేశాడట ఈ యంగ్ హీరో.
మధ్యతరగతి కుటుంబానికి చెందిన రాజ్ తరుణ్ ఇంట్లో వాళ్లను డబ్బులు అడగాలని అనుకున్నా వాళ్లను కూడా కష్టాలు చుట్టుముట్టడంతో రాజ్ తరుణ్ డబ్బులు అడగలేకపోయాడట.
సినిమాల్లో అవకాశాల కోసం బీటెక్ చదువును మధ్యలో మానేసి వచ్చిన ఈ యంగ్ హీరో వరుస ఫ్లాపులు ఎదురవుతూ ఉండటంతో కెరీర్ లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నా ఒక బ్లాక్ బస్టర్ హిట్ వస్తే రాజ్ తరుణ్ మళ్లీ వరుస అవకాశాలతో బిజీ కావడం గ్యారంటీ.