యువ హీరో రాజ్ తరుణ్ కెరియర్ లో వరుస ఫ్లాప్ లు ఉన్న గ్యాప్ లేకుండా అవకాశాలు సొంతం చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు.లాక్ డౌన్ టైంలో ఒరేయ్ బుజ్జిగా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ యువ హీరో ప్రస్తుతం పవర్ ప్లే అనే సినిమాతో విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలోనే మార్చి 5న సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు.
క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి సంబందించిన టీజర్ ని ఇప్పటికే రిలీజ్ చేశారు.రాజ్ తరుణ్ కెరియర్ లో థ్రిల్లర్ జోనర్ లో చేస్తున్న ఫస్ట్ సినిమా ఇదే కావడం విశేషం.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ యంగ్ హీరో మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు.అన్నపూర్ణ స్టూడియోస్ లో శ్రీనివాస్ గావిరెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.
గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు అనే సినిమా తెరకెక్కింది.ఈ సినిమా ఎవరేజ్ టాక్ సొంతం చేసుకుంది.
మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత అదే దర్శకుడుతో రాజ్ తరుణ్ సినిమా చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా కాన్సెప్ట్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని తెలుస్తుంది.
గోదావరి జిల్లాలలో రాజులకి తరతరాలు కూర్చొని తిన్నతరగని ఆసక్తి ఉంటుంది.ఈ కారణంగానే చాలా మంది రాజులు తమ వారసులకి కుటుంబ బాద్యతలు అప్పగిస్తారు తప్ప బయట ఉద్యోగాలకి పంపించారు.
అలా తండ్రి, తాతలు బోలెడు సంపాదించి పోతే, వాటిని అనుభవించడమే పనిగా పెట్టుకునే ఓ కుర్రాడు అనుకోకుండా ఇబ్బంధుల పాలైతే అన్న కాన్సెప్ట్ తో ఈ కథని దర్శకుడు సిద్ధం చేశాడని తెలుస్తుంది.పూర్తి వినోదాత్మకంగా ఈ సినిమా కథాంశం ఉండబోతుందని బోగట్టా.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యిందని, నాగార్జున అవుట్ పుట్ చూసి ఫైనల్ చేస్తే ఇక రిలీజ్ కి రెడీ అయిపోవడమే మిగిలి ఉందని టాక్ వినిపిస్తుంది.