అవికాగోర్, రాజ్ తరుణ్ కాంబినేషన్ అంటే ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మామా సినిమాలు గుర్తుకొస్తాయి.ఈ రెండు సినిమాలతో ఈ జంట బెస్ట్ పెయిర్ అనిపించుకోవడంతో పాటు ఆన్ స్క్రీన్ పై అందరికి కనెక్ట్ అయ్యింది.
ఆ రెండు సినిమాల తర్వాత ఇద్దరికి మంచి గుర్తింపు రావడంతో ఎవరి సినిమాలతో వారు బిజీ అయిపోయారు.తరువాత రాజ్ తరుణ్ హెబ్బా పటేల్ తో ఎక్కువ సినిమాలు చేశాడు.
వీరిద్దరి జంటకి కూడా ఆన్ స్క్రీన్ మీద మంచి గుర్తింపు ఉంది.టాలీవుడ్ లో మంచి క్రేజీ హీరోయిన్ అవుతుందని అనుకున్న అవికాగొర్ తరువాత బొద్దుగా తయారై అవకాశాలు కోల్పోయింది.
అయితే మరల కొంత కాలం సినిమాలకి గ్యాప్ ఇచ్చి పూర్తిగా స్లిమ్ అయ్యి రీఎంట్రీ ఇచ్చింది.ఆమె రాజుగారి గది3తో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.
దీంతో టాలీవుడ్ లో మళ్ళీ ఈ అమ్మడుకి బ్రేక్ ఇచ్చే సినిమాలు రాలేదు.అయితే రీసెంట్ గా రెండు రోజుల వ్యవధిలో అవికాగోర్ రెండు సినిమాలు స్టార్ట్ చేయడంతో పాటు వాటి నిర్మాణంలో కూడా భాగస్వామి కావడం ద్వారా సినిమా ఇండస్ట్రీలోనే తన ప్రయాణం ఉంటుందని చెప్పకనే చెప్పింది.
ఇదిలా ఉంటే రాజ్ తరుణ్, అవికాగోర్ మళ్ళీ తెరపై జోడీగా కనిపిస్తే చూడాలని వారి ఫాన్స్ కోరుకుంటున్నారు.త్వరలో ఈ కోరిక నెరవేరనుందని తాజాగా రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చాడు.
రాజ్ తరుణ్ తాజాగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ తన నెక్స్ట్ సినిమాలు, వ్యక్తిగతం జీవితం, పెళ్లి గురించి స్పందించాడు.అదే సమయంలో అవికాగోర్ తో రిలేషన్ గురించి చెప్పుకొచ్చాడు.
అవికా తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పాడు.త్వరలో మరోసారి మా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు.