శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ కావడంతో దేశవ్యాప్తంగా అతని పేరు మారుమ్రోగిందనే సంగతి తెలిసిందే.రాజ్ కుంద్రా బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తుండగా ఆ ప్రయత్నాలు ఫెయిల్ అవుతుండటం గమనార్హం.
తాజాగా రాజ్ కుంద్రా బెయిల్ కోసం ప్రయత్నాలు చేయగా కోర్టు బెయిల్ ను తిరస్కరించడం గమనార్హం.క్రైమ్ బ్రాంచ్ అధికారులు రాజ్ కుంద్రాపై చెప్పిన విషయాల వల్ల రాజ్ కుంద్రాకు బెయిల్ రావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రాజ్ కుంద్రా మరికొన్ని రోజుల పాటు జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి నెలకొనగా అతనికి బెయిల్ మంజూరవుతుందో లేదో చెప్పే పరిస్థితి లేదు.రాజ్ కుంద్రా కేసు విచారణకు సహకారం అందించడం లేదు.
రాజ్ కుంద్రాకు బెయిల్ మంజూరు అయితే ఆయన సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశాలు అయితే ఉంటాయి.రాజ్ కుంద్రా బ్రిటన్ పౌరుడు కావడం కూడా బెయిల్ మంజూరు కావడానికి సమస్యగా మారింది.
క్రైమ్ బ్రాంచ్ అధికారులు రాజ్ కుంద్రా కూడా నీరజ్ మోడీలా బెయిల్ మంజూరు చేస్తే తప్పించుకుని వెళతాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దర్యాప్తు కొనసాగుతున్న టైమ్ లో బెయిల్ మంజూరు అయితే విదేశాల నుంచి అశ్లీల చిత్రాలను అప్ లోడ్ చేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.బెయిల్ మంజూరైతే బాధితులకు న్యాయం జరగదని ఇప్పటికే రాజ్ కుంద్రా కొన్ని సాక్ష్యాలను నాశనం చేశాడని పోలీసులు చెబుతున్నారు.
రాజ్ కుంద్రాకు బెయిల్ మంజూరైతే ఆయన మరిన్ని సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలు అయితే ఉంటాయి.కోర్టు కస్టడీ విధించడంతో ఈ నెల 20వ తేదీ వరకు రాజ్ కుంద్రా జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి నెలకొంది.గత నెల 19వ తేదీన పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.