బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే.ఆ సమయంలో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా పేర్లు ప్రతి ఒక్క సినీ ఇండస్ట్రీలో మార్మోగి పోయాయి.
అంతేకాకుండా కొద్ది రోజులపాటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా రాజ్ కుంద్రా కేసు గురించే వార్తలు వినిపించాయి.గత ఏడాది జూలై 19న రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయ్యాడు.
ఆ తర్వాత రాజ్ కుంద్రా బెయిల్ పై బయటకు వచ్చాడు.అయితే పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత రాజ్ కుంద్రా మీడియా కంట కానీ, సోషల్ మీడియాలో కానీ పెద్దగా కనిపించలేదు.
ఇక పోర్నోగ్రఫీ కేసులో ఇరుక్కోవడంతో తన ఇంస్టాగ్రామ్ పోస్టులను తొలగించడమే కాకుండా, తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని పూర్తిగా డిలీట్ చేసేసాడు.ఇది ఇలా ఉంటే రాజ్ కుంద్రా మళ్లీ సోషల్ మీడియాలో కి రీ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాకు రీఎంట్రీ ఇచ్చిన రాజ్ కుంద్రా ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని తిరిగి ఓపెన్ చేసి ఒకే ఒక్కరిని ఫాలో అవుతున్నారు.అయితే రాజ్ కుంద్రా ఫాలో అవుతున్న ఆ ఒకే ఒక్క అకౌంట్ ఎవరిది అన్న ఆలోచనలో పడ్డారు నెటిజన్స్.
రాజ్ కుంద్రా కొత్త ఇంస్టాగ్రామ్ అకౌంట్ కి దాదాపుగా 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.అంతేకాకుండా ఆ అకౌంట్ కి వెరీ పైడ్ మార్కు కూడా ఉంది.
అయితే రాజ్ కుంద్రా ను పది లక్షల మంది ఫాలో అవుతుంటే, రాజ్ కుంద్రా మాత్రం ఒక్కరిని మాత్రమే ఫాలో అవుతున్నాడు.అయితే ఆ అకౌంట్ తన భార్య శిల్పాశెట్టి దో లేకపోతే అతని కుమారుడు వియాన్ దీ అనుకుంటే పొరపాటు పడినట్లే.ఎందుకంటే రాజు కుంద్రా ఫాలో అవుతుంది ఎవరినో కాదు రాజ్ కుంద్రా బాంద్రాలోని ఒక సీ ఫుడ్ రెస్టారెంట్ ను ఫాలో అవుతున్నాడు.ఆ రెస్టారెంట్ లో అతడికి కూడా భాగస్వామ్యం ఉంది.
దానివల్ల రాజ్ కుంద్రా ఆ అకౌంట్ ని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.అయితే రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది.
గత ఏడాది 2021 డిసెంబర్ లో రాజ్ కుంద్రా తాను పోర్నోగ్రఫీ చిత్రాలను నిర్మించలేదని, వాటిని డిస్ట్రిబ్యూట్ కూడా చేయలేదని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.అంతేకాకుండా రాజ్ కుంద్రా బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత రాజ్ కుంద్రా అతని భార్య శిల్పాశెట్టి ఇద్దరూ విడిపోతున్నట్లు కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.
ఈ విషయంపై ఆ జంట కాస్త గట్టిగానే సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే.