యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఏకంగా చేతిలో ఐదు ప్రాజెక్ట్ లు పెట్టుకొని ఉన్నాడు.వాటిలో రాధేశ్యామ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతుంది.
అయితే కరోనా పరిస్థితులు ఈ సినిమాకి ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయి.ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.
అలాగే సలార్ మూవీ కూడా షూటింగ్ దశలో ఉంది.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ కూడా సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అవుతుంది.
మరో వైపు బాలీవుడ్ లో సిద్దార్ద్ ఆనంద్ దర్శకత్వంలో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేయడానికి ఒకే చెప్పాడు.ఇలా ఐదు ప్రాజెక్ట్ లు ఉన్నాయి.
ఇవన్ని ప్రభాస్ పూర్తి చేయాలంటే ఓ ఐదేళ్ళు పడుతుంది.ఈ లోపు మరే దర్శకుడుకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే ప్రస్తుతం లేదు.
అయితే సుధా కొంగర, చంద్రశేఖర్ ఏలేటి ప్రభాస్ కి కథ చెప్పడం కోసం రెడీగా ఉన్నారు.ఇదిలా ఉంటే ప్రభాస్ కి మాత్రం ఒకే ఒక్క దర్శకుడుతో తన కెరియర్ కచ్చితంగా సినిమా చేయాలని ఆశపడుతున్నాడు.
అతనితో సినిమా చేసే అవకాశం వస్తే స్టొరీ కూడా వినకుండానే ఒకే చెప్పడానికి రెడీగా ఉన్నాడు.ఆ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ.
మున్నాభాయ్ ఎంబీబీఎస్, త్రీఇడియట్స్, పీకే, సంజూ లాంటి సినిమాలు చేసిన ఈ దర్శకుడు కథని చెప్పే విధానంగా డిఫరెంట్ గా ఉంటుంది.సోషల్ ఎలిమెంట్ ని కాస్తా కామెడీ, సెటైరికల్ మిక్స్ చేసి చెబుతూ ఉంటాడు.
ఇతని సినిమాలు ప్రభాస్ ఎక్కువ చూస్తూ ఉంటాడంట.అలాగే అతని డైరెక్షన్ అనే ప్రభాస్ కి చాలా ఇష్టం అంట.అవకాశం వస్తే కచ్చితంగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో సినిమా చేస్తానని ప్రభాస్ చెప్పినట్లు తెలుస్తుంది.