అమ్మాయిలు అందం విషయంలో ఎంతో జాగ్రత్త పడుతుంటారు.తమ శరీరాకృతి నుండి తమ చర్మం వరకు ప్రతి ఒక్క విషయంలో అందంగా ఉండాలనుకుంటూ ఎన్నో ప్రోడక్ట్స్ వాడుతుంటారు.
ప్రత్యేకంగా అందం కోసం స్పెషలిస్టుల దగ్గరికి కూడా వెళుతూ ఉంటారు.కానీ కొంతమందికి పలు సందర్భాలలో అందం కోసం చేసే చికిత్స ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది.
దీంతో వాళ్ళకి శరీర మార్పులు కానీ, చర్మ సమస్యలు కానీ ఎదురవుతుంటాయి.ఇదంతా ఇలా ఉంటే ఇలాంటి సంఘటన ఎదుర్కొంది ఓ హీరోయిన్.
తమిళ ఇండస్ట్రీకి చెందిన నటి, బిగ్ బాస్ బ్యూటీ రైజా విల్సన్.తను తమిళ సినిమా ద్వారా 2017 లో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ తర్వాత మరో సినిమాతో హీరోయిన్ గా అవకాశం అందుకుంది.ఇక తమిళ బిగ్ బాస్ లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొని మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
ఇదంతా ఇలా ఉంటే గత నెలలో తనకు ఓ చేదు అనుభవం ఎదురయింది.
తన అందాన్ని మరింత ఫేషియల్ చేసుకోవడం కోసం ఓ క్లినిక్ కి వెళ్ళింది.అక్కడ లేడీ డాక్టర్ బైరవి ఆ హీరోయిన్ ముఖం మరింత అందంగా కనిపించడానికి ఓ కొత్త ప్రయోగం చేసింది.ఇక వైద్యం కాస్త ఆ హీరోయిన్ పై దెబ్బతీసింది.
ముందు ఉన్న అందం మొత్తం కోల్పోయింది రైజా.కంటి కింద వాచిపోయి కమిలి పోయింది.
చర్మం మొత్తం చాలా మారిపోగా తన ఫోటోలు తన ఇన్స్ స్టా గ్రామ్ వేదికగా పంచుకుంది రైజా.వెంటనే డాక్టర్ కి ఫోన్ చేయగా.
తను స్పందించకపోవడంతో తన సిబ్బందిని కూడా అడిగింది.అతడు కూడా ఆ డాక్టర్ ఊర్లో లేదని చెప్పాడు.
అంతటితో ఆగక ఆ డాక్టర్ బలవంతంగా వైద్యం చేశారని సోషల్ మీడియా ద్వారా తెలిపింది.అంతేకాకుండా తనకు జరిగిన నష్టానికి కోటి రూపాయల నష్టపరిహారంతో పాటు చికిత్సకు తీసుకున్న డబ్బులు కూడా చెల్లించాలని డిమాండ్ చేసింది.
సదరు ఆ డాక్టర్ కూడా ఈ విషయం గురించి గట్టిగా స్పందించింది.తన పేరు బయట పెట్టి పరువు తీసినందుకు రైజా పై ఐదు కోట్ల పరువు నష్టం వేసింది.
ఇక ఆ తర్వాత ఈ గొడవ ఎలా ముగిసిందో తెలియదు కానీ.మళ్లీ రైజా సోషల్ మీడియా లో ఎంట్రీ ఇచ్చింది.
తాజాగా ఒక ఫోటో షేర్ చేసింది.అందులో మొత్తానికి అందంగా కనిపించింది.
కంటి వాపు కూడా పూర్తిగా తగ్గింది.ఇక మళ్ళీ తను ఎటువంటి విషయాన్ని పంచుకోలేదు.
బహుశా తన అందం తిరిగి వచ్చిందని అభిమానులకు తెలియచేసేలా పోస్ట్ చేసినట్లు అనిపిస్తుంది.మొత్తానికి ఈ తమిళ బ్యూటీ తన అందాన్ని వెనక్కి తెచ్చుకుంది.
ఇక ప్రస్తుతం ఎఫ్ ఐ ఆర్ సినిమాలో బిజీగా ఉంది.అంతేకాకుండా వరుసగా ఐదు సినిమాల్లో నటించనున్నట్లు తెలుస్తోంది.