జబర్దస్త్. ఎంతో మంది మట్టిలో మాణిక్యాలను కమెడియన్లుగా తీర్చిదిద్దింది ఈ కామెడీ షో.ఈ షో మూలంగా పలువురు తమ సత్తా చాటుకున్నారు.ఇండస్ట్రీలో కనీవినీ ఎరుగని పేరు సంపాదించుకున్నారు.
ఈ షోలో రాణించిన పలువురు కమెడియన్లు సినిమా రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.పలువురు పలు రకాల కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా.
తమను కమెడియన్లుగా తీర్చిదద్దిన జబర్దస్త్ ను మాత్రం మర్చిపోవడం లేదు.అయితే గడిచిన కొంత కాలంగా హైపర్ ఆది టీంలో మరో లీడర్ రైజింగ్ రాజు మాత్రం కనిపించడం లేదు.
బయట కూడా తను కనిపించడం లేదు.ఇంతకీ తను ఎక్కడికి వెళ్లాడు? అనే విషయంపై చర్చ జరిగింది.
అటు హైపర్ ఆది టీంలో రాజు లేకుండానే స్కిట్స్ వేస్తున్నారు.దొరబాబు, పరదేశీతో కలిపి తన స్కిట్ చేస్తున్నాడు.అయితే రైజింగ్ రాజు ఉన్నా, లేకపోయినా.వారి స్కిట్లు మాత్రం పటాసుల్లా పేలుతూనే ఉన్నాయి.
రాజు ఉంటే ఇంకా కాస్త ఎక్కువ పంచులు వేసేవాడు కదా.అనే టాక్ నడుస్తుంది.ఇద్దరు కలిసి బాగా కామెడీ చేస్తారు కాబట్టే.వారి టీమ్ కు హైపర్ ఆది.రైజింగ్ రాజు అనే పేరు పెట్టారు.రాజుకు టీమ్ లీడర్ పేరైతే ఇచ్చారు కానీ.
ఆదిదే అసలు పాత్ర.ఆయన స్కిట్ ను ముందుండి రన్ చేస్తాడు.
అంతేకాదు.పేమెంట్స్ విషయాన్ని చూసుకునేది కూడా ఆదియే.స్కిట్ రాసేది కూడా తనే.అందుకే తన టీంలో ఆదియే కీలక పాత్ర పోషిస్తాడు.అయితే గడిచిన కొంతకాలంగా రాజు కనిపించ లేదు.దాంతో ఆయన ఎక్కడికి వెళ్లాడు అనే ప్రశ్న తలెత్తుతోంది.
ఇంతకీ తను ఎందుకు కనిపించలేదో.తాజాగా చెప్పాడు రాజు.కరోనా సమయంలో తనకు మనువరాలు పుట్టిందని చెప్పాడు.ఆ సమయంలో బయటకు వెళితే పాపకు ఇబ్బంది కలుగుతుందని తాను బయటకు రాలేదని చెప్పాడు.అందుకే జబర్దస్త్ షోలో కూడా కనిపించలేదన్నాడు.పాప ఆరోగ్యం గురించి భయపడే తను బయటకు రాలేదన్నాడు.
తాను షో చేయకపోయినా.ఆది మాత్రం తనకు ప్రతినెలా పేమెంట్ మాత్రం ఇంటికి పంపించాడని చెప్పాడు.
నిజానికి తను దేవుడు లాంటి మనిషని చెప్పాడు.