పసిడి ధరలు పైపైకి… బంగారం విషయంలో భారత ప్రజలకు ఎక్కువగా భావోద్వేగపరమైన సంబంధం ఉంటుంది.భారతదేశంలో అందుకే ప్రజలు ఎక్కువ బంగారం కొనడానికి ఇష్టపడతారు.
ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ డబ్బులు ఉంటే బంగారం కొనడానికే ఇష్టపడతారు.పసిడి ధరల కథ లేకపోయినా ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పసిడి ధరలు హైజంప్ చేశాయి.వచ్చేే శ్రావణ మాసం కోసం నగలు కొనుకుందాం అనుకునే నారీమణుల విషయం తలకిందులైంది.
పసిడి ధర మళ్లీ పైకి ఎగిసి బంగారు ప్రియుల కు బాధ పెట్టింది.వెండి ధర కాస్త తగ్గుముఖం పట్టింది.హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 220 పైకి కదలడంతో రూ.48,880కి చేరింది.10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర .200 పెరిగి రూ.44,800కు చేరింది.ఇక వెండి రేటు 500 తగ్గడంతో కేజీ వెండి ధర 71 వేల నాలుగు వందలు దిగివచ్చింది.అంతర్జాతీయ మార్కెట్లో బంగాారం ధర పైకి ఎగిరింది.0.91 శాతం పెరగడంతో పసిడి రేటు ఔన్స్ కు 1816 డాలర్లకు చేరింది.వెండి రేటు కూడా ఔన్స్ 1.41 శాతం పెరగడంతో 25 .22 డాలర్లకు పెరిగింది.